Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
తెలంగాణ బొగ్గు గనుల్లోకి ప్రభాస్: అక్కడి నుంచే యాక్షన్ షురూ చేయనున్న రెబెల్ స్టార్
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన సూపర్ హిట్ సిరీస్ 'బాహుబలి' నుంచి వరుసగా పాన్ ఇండియా సినిమాలే చేస్తూ దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతున్నాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. ఇప్పటికే 'జిల్' డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తోన్న 'రాధే శ్యామ్'లో నటిస్తోన్నాడతను. ఇది పట్టాలపై ఉండగానే 'కేజీఎఫ్' మూవీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించనున్న 'సలార్'లోనూ నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. కొద్ది రోజుల క్రితం పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్ అతి త్వరలోనే ప్రారంభం కాబోతుంది.
తాజా సమాచారం ప్రకారం.. 'సలార్' ఫస్ట్ షెడ్యూల్ తెలంగాణ రాష్ట్రం పెద్దపల్లి జిల్లాలోని రామగుండం సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో ప్రారంభం కానుందట. అక్కడి ఓసీపీ-2లో జరిగే యాక్షన్ సీన్తో షూటింగ్ ప్రారంభం కాబోతుందని తెలుస్తోంది. దాదాపు యాభై మంది ఫైటర్లతో ఈ యాక్షన్ సీన్ జరగనుందని అంటున్నారు. ఇప్పటికే అక్కడి అధికారుల నుంచి పర్మీషన్ కూడా తీసుకుందట చిత్ర యూనిట్. చాలా రోజుల తర్వాత బొగ్గు గనుల్లో షూటింగ్ జరుగుతుందన్న న్యూస్ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవుతోంది. దీంతో అక్కడి వాళ్లంతా ప్రభాస్ రాకకై వేచి చూస్తున్నారు.
కమిట్మెంట్ మూవీ స్టిల్స్ : అన్వేషి జైన్, తేజస్వీ మడివాడ హాట్ గ్యాలరీ (ఫొటోలు)
ప్రభాస్ హీరోగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న 'సలార్'ను హొంబళే ప్రొడక్షన్స్ బ్యానర్పై విజయ్ కిరగందుర్ నిర్మిస్తున్నాడు. తెలుగు, కన్నడం, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం రూపొందనుంది. ఇక, ఈ సినిమాలో హీరోకు సమానమైన విలన్ పాత్ర కూడా ఉంటుందని, అందుకే దీని కోసం దక్షిణాది స్టార్ హీరో విజయ్ సేతుపతిని ఎంపిక చేసుకున్నారని ఇటీవల ఓ న్యూస్ బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఇక, ఈ సినిమాలో హీరోయిన్గా కత్రినా కైఫ్, దిశా పటానీ, శృతి హాసన్ ఇలా ఎంతో మంది పేర్లు తెరపైకి వస్తున్నాయి.