Don't Miss!
- News జగన్ ను జైల్లో పెట్టావ్.. పుట్టపర్తి సాయిబాబా సంపదంతా దోచుకున్నావ్: తగ్గని మంత్రి పెద్దిరెడ్డి
- Technology Lava ProWatch లావా ప్రోవాచ్ డిజైన్, ధర వివరాలు లీక్.. ఫంక్షన్ కీ సహా కీలక హెల్త్ ట్రాకర్లు..!!
- Sports ముక్కలవుతున్న ముంబై.. హార్దిక్ను విమర్శిస్తూ నబీ పోస్ట్
- Lifestyle ఎండాకాలంలో ఈ ఫుడ్స్కు దూరంగా ఉండాలి.. లేదంటే డీహైడ్రేషన్ తప్పదు..
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
మహేష్ కెరీర్ను మలుపు తిప్పిన ఆ సినిమాకు సీక్వెల్.. మరోసారి ఆ కాంబో హిట్టు కొట్టగలదా?
సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో బాక్సాఫీస్ హిట్ గా నిలిచిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. అయితే అందులో ట్రెండ్ సెట్ చేసిన సినిమాలు కూడా చాలానే ఉన్నాయి. మహేష్ కెరీర్ మొదట్లో బాక్సాఫీస్ వద్ద క్లిక్కవ్వడానికి ఎంతగానో కష్టపడ్డాడు. ఎంతగానో నమ్మకం పెట్టుకున్న కొన్ని సినిమాలు ఊహించని విదంగా దెబ్బ కొట్టాయి. అయితే కెరీర్ ను మలుపు తిప్పిన సినిమా మాత్రం ఒక్కడు. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ కూడా రెడీ అయ్యే ఛాన్స్ ఉన్నట్లుగా రూమర్స్ వస్తున్నాయి.
ట్రెండ్ సెట్ చేసిన ఒక్కడు
గుణశేఖర్ దర్శకత్వంలో మహేష్ మూడు సినిమాలు చేశాడు. సైనికుడు, అర్జున్ అంతగా ఆడలేదు. కానీ మొదట చేసిన ఒక్కడు మాత్రం ఒక ట్రెండ్ సెట్ చేసింది. సినిమా ఊహించని విధంగా బాక్సాఫీస్ వద్ద పెను సంచలనాన్ని క్రియేట్ చేసింది. ఇక ఆ సినిమా తరువాత మహేష్ అగ్ర హీరోల జాబితాలోకి చేరాడు. యంఎస్.రాజు ఆ సినిమా నిర్మించిన విషయం తెలిసిందే.
గోపీచంద్ విలన్ గా..
ఆ సినిమా విజయం సాధిస్తుందని అనుకున్నారు గాని మరీ బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టేంతల సక్సెస్ అవుతుందని ఎవరు ఊహించలేదు. రాయలసీమ, పాతబస్తీలో బ్యాక్ గ్రౌండ్ లో కబడ్డీ ఆటను మిక్స్ చేసి మంచి లవ్ స్టోరీని కూడా ప్రజెంట్ చేసిన గుణశేఖర్ స్థాయి కూడా ఆ సినిమాతో అమంతగా పెరిగిపోయింది. మొదట ప్రకాష్ రాజ్ చేసిన విలన్ పాత్రకు గోపిచంద్ ను అనుకోగా చివరి నిమిషంలో చేంజ్ చేయాల్సి వచ్చిందట.
17 ఏళ్ల తరువాత సీక్వెల్..
ఇక సరిగ్గా 17 ఏళ్ళ తరువాత సినిమాకు సంబంధించిన సీక్వెల్ పై చర్చలు మొదలైనట్లు టాక్ అయితే గట్టిగానే వస్తోంది. నిర్మాత యంఎస్.రాజు ఒక్కడు 2 కాంబినేషన్ ను మళ్ళీ భారీ స్థాయిలో సెట్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అయితే ఆ సీక్వెల్ కు మహేష్ ఒప్పుకుంటాడా లేదా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇక దర్శకుడు గుణశేఖర్ కూడా రెండవసారి మ్యాజిక్ క్రియేట్ చేస్తాడా అనేది మరొక పెద్ద సందేహం.
Recommended Video
మళ్ళీ ఆ కాంబో సెట్టవుతుందా?
ప్రస్తుతం మహేష్ బాబు సర్కారు పాట సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఆ సినిమా అయిపోతే వెంటనే మరో బిగ్ బడ్జెట్ సినిమాను కూడా లైన్ లో పెట్టాలని చూస్తున్నాడు. ఇక ఈ క్రమంలో యంఎస్.రాజు కూడా ఒక్కడు 2పై మహేష్ తో చర్చించాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. మరోవైపు దర్శకుడు గుణశేఖర్ శాకుంతలం అనే సినిమా చేస్తున్నాడు. మరి ఈ కాంబోలో ఒక్కడు వస్తుందా లేదా అనే విషయంలో క్లారిటీ రావాలి అంటే అఫీషియల్ గా ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.