Don't Miss!
- Sports T20 World Cup 2024 బ్రాండ్ అంబాసిడర్గా పరుగుల చిరుత.!
- News కూతురు ఎవరికైనా కూతురే, ఎన్నికల సమయంలో రాజకీయాలా, నీతులు చెబుతున్న లీడర్!
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మెగాస్టార్ దర్శకుడితో రామ్ చరణ్ సీక్వెల్ మూవీ.. క్లారిటీ ఇచ్చిన ప్రముఖ నిర్మాత
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తన 15వ సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా తెరపైకి రాబోతున్న ఆ సినిమాను దిల్ రాజు భారీ బడ్జెట్లో నిర్మిస్తున్నారు. అలాగే జెర్సీ దర్శకుడు గౌతమ్ తిన్నానూరి దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేసేందుకు చేయబోతున్నట్లు అఫీషియల్ గా ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. ఇక ఇప్పుడు మరో సీక్వెల్ పై కూడా చర్చలు స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఆగిపోయే అవకాశం?
గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్ట్ ఆగిపోయే అవకాశం ఉందని కూడా మధ్యలో ఒక టాక్ అయితే వచ్చింది. కానీ రామ్ చరణ్ మాత్రం కథలో కొన్ని మార్పులు చేసిన తర్వాత ప్రాజెక్టును స్టార్ట్ చేద్దామని దర్శకుడుని కోరినట్లుగా మరొక టాక్ అయితే వినిపించింది. ఇక రాబోయే రోజుల్లో రామ్ చరణ్ తేజ్ మరొక సీక్వెల్ సినిమా కూడా చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.
నిర్మాత క్లారిటీ
రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో నిర్మాత ఎన్ వి ప్రసాద్ ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. కొణిదెల ప్రొడక్షన్స్ తో కలిసి ఎన్ వి ప్రసాద్ గాడ్ ఫాదర్ సినిమాను సంయుక్తంగా నిర్మించిన విషయం తెలిసిందే. ఇక ఆ సినిమాకు దర్శకత్వం వహించిన మోహన్ రాజా తప్పకుండా రామ్ చరణ్ తో మరో సినిమా చేస్తానని గతంలోనే క్లారిటీ ఇచ్చాడు.
దృవ సీక్వెల్
ఇక తమిళంలో ఒరిజినల్ గా దృవ సినిమాను మోహన్ రాజు డైరెక్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఆ ప్రాజెక్టుకు సంబంధించిన సీక్వెల్ కథ కూడా రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం మోహన్ రాజా రామ్ చరణ్ తో దృవ సీక్వెల్ కు సంబంధించిన చర్చలు జరుపుతున్నట్లుగా నిర్మాత ఎన్ వి ప్రసాద్ వివరణ ఇచ్చారు. ఒకవేళ అన్నీ అనుకున్నట్లు సెట్ అయితే మాత్రం తప్పకుండా రాంచరణ్ తోనే సీక్వెల్ రూపొందించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక తమిళంలో దృవ సినిమాలో మోహన్ రాజా సోదరుడు జయం రవి నటించిన విషయం తెలిసిందే.
ఆ దర్శకులతో..
ఇక మరోవైపు రామ్ చరణ్ మరో తమిళ దర్శకుడితో కూడా సినిమా చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. గతంలోనే లోకేష్ కనగారాజ్ దర్శకత్వంలో చేసే ఛాన్స్ ఉందని టాక్ వచ్చింది. అంతేకాకుండా కన్నడ దర్శకుడు ప్రశాంతం నీల్ తో కూడా అప్పట్లో ఒక ప్రాజెక్ట్ అయితే అనుకున్నారు. కానీ ఆ విషయంలో అయితే ఇంకా క్లారిటీ రాలేదు. ప్రస్తుతం కూడా రామ్ చరణ్ మరి కొంతమంది యువ దర్శకులతో కొత్త కథలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు టాక్ వస్తోంది.