Don't Miss!
- News పవన్ అప్పుల చిట్టా రూ. 46,70,00,000: `వదిన` దగ్గర పర్సనల్ లోన్
- Sports CSKకి కొత్త సమస్య.. ప్లేఆఫ్స్ చేరాలంటే ఎలా?
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Automobiles వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- Technology అద్భుతమైన డిజైన్ తో నోకియా కొత్త ఫోన్ Nokia N90 Flip ! వివరాలు
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
పూరి జగన్నాథ్, అనిల్ రావిపూడి.. ఇద్దరు ఆ హీరో కోసమే..
ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో చాలా వేగంగా షూటింగ్ పూర్తి చేయడం అంటే సాధ్యం కానీ పని. ఎంత ప్లాన్ చేసుకున్నా కూడా పెద్ద హీరోలతో సినిమా అంటే ఏడెనిమిది నెలలు పడుతుంది. కాస్త లేటయినా కూడా ఏడాది అయితే ఈజీగా అవుతుంది. అసలు మ్యాటర్ లోకి వస్తే ఈ మధ్య కాలంలో కూడా వేగంగా షూటింగ్స్ పూర్తి చేసేవారిలో ఇద్దరు స్టార్ దర్శకులు ఉన్నారు.
సీనియర్ దర్శకుడు పూరి జగన్నాథ్ ఎంత స్పీడ్ గా షూటింగ్ పూర్తి చేస్తాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. చాలా సందర్భాల్లో అది ఋజువయ్యింది. ఇక మరో దర్శకుడు అనిల్ రావిపూడి కూడా పూరి స్టైల్ లోనే శరవేగంగా పూర్తి చేస్తున్నాడు. అయితే ఇప్పుడు ఈ ఇద్దరు కూడా ఒక హీరో కోసం టార్గెట్ సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆ హీరో మరెవరో కాదు మహేష్ బాబు.
మహేష్ బాబు సర్కారు వారి పాట తరువాత ఎవరితో సినిమా చేస్తారు అనేది సస్పెన్స్ గా మారింది. రాజమౌళితో ఒక సినిమా అనుకున్నప్పటికి ఆయన RRR పూర్తయ్యే సరికి మహేష్ తన సినిమాను రిలీజ్ కూడా చేసేస్తాడు. జక్కన్న తో చేసేకంటే ముందు ఒక ఐదారు నెలలు గ్యాప్ వస్తుందట.
అందుకే మహేష్ త్వరగా వర్క్ చేసే బెస్ట్ దర్శకులను లైన్ లో పెడుతున్నట్లు తెలుస్తోంది. ఇదివరకే అనిల్ తో ఒక సినిమా చేస్తానని మాట ఇచ్చిన మహేష్ పూరితో కూడా వర్క్ చేయవచ్చని టాక్ వచ్చింది. మరి ఫైనల్ గా మహేష్ ఎవరిని సెలెక్ట్ చేసుకుంటాడో చూడాలి.