'వాస్కో డ గామా' అంటూ ఆసక్తి రేకెత్తిస్తున్న పూరి!
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ చివరగా తెరకెక్కించిన చిత్రం మెహబూబా. తన తనయుడు ఆకాష్ పూరిని హీరోగా పెట్టి చేసిన ఈ చిత్రం నిరాశపరిచింది. ఎమోషనల్ లవ్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం ఆడియన్స్ కు కనెక్ట్ కాలేదు. ఈ నేపథ్యంలో పూరి జగన్నాథ్ తదుపరి చిత్ర ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.
తదుపరి చిత్రం కూడా పూరి తన తనయుడితోనే ఉంటుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి కొందరు మాత్రం ఆకాష్ తడుఅప్రి చిత్రానికి పూరి నిర్మాతగా మాత్రమే ఉంటాడని అంటున్నారు. మరోవైపు పూరిజగన్నాథ్ వేరే హీరోలతో సినిమా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇటీవల ఫిల్మ్ ఛాంబర్ లో పూరి జగన్నాథ్ వాస్కో డ గామా అనే టైటిల్ రిజిస్టర్ చేయించారట. ఆసక్తి రేపుతున్న ఈ టైటిల్ ఎవరి కోసం అంటూ చర్చ మొదలైంది. దీనికి సంబందించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.


Click it and Unblock the Notifications











