Don't Miss!
- Sports చరిత్ర సృష్టించిన అక్షర్ & పంత్ క్రేజీ రికార్డు
- Lifestyle చింత చిగురు పప్పు: నోట్లో నీళ్ళు ఊరాల్సిందే.. వాసనకు కడుపు నిండాల్సిందే..
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ పర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ
- News జగన్ కు వైఎస్ వివేకా భార్య లేఖ-అవినాష్, వైసీపీ అటాక్ పై-న్యాయంవైపు నిలబడాలని విన్నపం..!
- Finance Kotak Mahindra Bank: కొంపముంచిన కోటక్ మహీంద్రా బ్యాంక్.. భారీగా పడిపోయిన స్టాక్..!
- Technology ఆపిల్ తరహా డిజైన్తో నాయిస్ స్మార్ట్వాచ్.. 1.85 అంగుళాల డిస్ప్లే, 7 రోజుల బ్యాటరీ లైఫ్తో విడుదల
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
Radheshyam సినిమాలో విలన్ ఎవరు.. హైలెట్ కాబోయే హై వోల్టేజ్ సీన్ అదే!
ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో చాలా రోజుల తర్వాత విడుదల అవుతున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్. ప్రభాస్ పూజ హెగ్డే హీరో హీరోయిన్ గా నటించిన సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సరికొత్త లవ్ అడ్వెంచరస్ మూవీగా దర్శకుడు రాధాకృష్ణ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరపైకి తీసుకు వస్తున్నాడు. మార్చి 25 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో ఈ సినిమా విడుదలవుతోంది. ఒక విధంగా ప్రభాస్ సినిమా కెరీర్లోనే అత్యధిక థియేటర్స్ లో ఈ సినిమా విడుదల చేస్తున్నారు. తప్పకుండా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తుంది అని యు.వి.క్రియేషన్స్ అంచనాలకు మించి ఈ సినిమాను విడుదల చేస్తోంది.
యు.వి.క్రియేషన్స్ తో పాటు గోపికృష్ణ బ్యానర్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ ఒక పామిస్ట్ పాత్రలో కనిపించబోతున్నాడు. విక్రమాదిత్య అనే పాత్ర ఈ సినిమాలో చాలా హైలెట్ గా ఉంటుందని ఇదివరకే విడుదల చేసిన ట్రైలర్ తో ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. అంతేకాకుండా సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ కూడా అద్భుతంగా ఉంటాయి అని అర్ధమయ్యింది. అయితే హీరోయిన్ ఇక పూజ చేసిన ప్రేరణ పాత్ర కూడా సినిమాలో చాలా విభిన్నంగా ఉంటుందట. ప్రేమకు విధికి జరిగిపోయే యుద్ధమే రాధేశ్యామ్ అసలు కథ అని దర్శకుడు ముందుగానే క్లారిటీ ఇచ్చాడు. ఇక ఈ సినిమాకు దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి వాయిస్ ఓవర్ ఇచ్చిన విషయం తెలిసిందే.
సినిమాలో కొన్ని ముఖ్యమైన పాత్రలలో కృష్ణంరాజు జగపతిబాబు నటించారు. వారి పాత్రలతో సినిమా చాలా ట్విస్టులు ఉంటాయి అని తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో ప్రధాన విలన్ ఎవరు అనేది ఈ విషయంలో ఇంతవరకు చిత్ర యూనిట్ సభ్యులు పెద్దగా క్లారిటీ అయితే ఇవ్వలేదు. ఇప్పటి వరకు ప్రభాస్ ప్రతి సినిమాలో పవర్ ఫుల్ విలన్ లు ఉండగా ఇప్పుడు మాత్రం రాధేశ్యామ్ సినిమాలు అలాంటి పవర్ఫుల్ విలన్ ఎవరూ లేరని తెలుస్తోంది. సినిమా రొమాంటిక్ అడ్వెంచర్ లవ్ ఎంటర్టైనర్ కాబట్టి ఈ సినిమాలో మెయిన్ విలన్ అని ట్విస్టులు తెలుస్తోంది.
కాలంతో హీరో ఎలా పోటీ పడ్డాడు అలాగే తన ప్రేమ కోసం ఆ కాలాన్ని మళ్లీ వెనక్కి తీసుకొచ్చి మరణాన్ని గెలిచాడా లేదా అనేది ఒక కోర్ పాయింట్ అని సమాచారం. తప్పకుండా సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అని చెబుతున్నారు. ఇక క్లైమాక్స్ లో వచ్చే భారీ ఓడ సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయట. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సినిమా కు వర్క్ చేసిన గ్రాఫిక్ డిజైనర్ కూడా సముద్రం మధ్యలో భారీ ఓడ కు సంబంధించిన సన్నివేశాలు టైటానిక్ షిప్ నుంచి ఉంటాయి అని చెప్పడం విశేషం. అంతే కాకుండా రాధాకృష్ణ ఇండియన్ జేమ్స్ కెమెరున్ అని సంభోదించారు.