Don't Miss!
- Sports RCB vs KKR: 500 టీ20 మ్యాచ్ ఆడబోతున్న ఐపీఎల్ స్టార్.. మ్యాన్ ఆఫ్ మెయిడెన్ ఓవర్స్
- News వైసీపీకి చిక్కిన లోకేష్ ట్వీట్..ఆ వెంటనే ఏం చేశారంటే..?
- Finance Gold Rate Today: బంగారం ప్రియులకు షాక్.. పెరిగిన ధర..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- Lifestyle Lok Sabha Election 2024:మరో 3 నెలల్లో పట్టాభిషేకం ఎవరికి? జ్యోతిష్యం ఏ పార్టీకి స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తోంది
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
మొదటిసారి రూటు మార్చిన రాజ్ తరుణ్.. థ్రిల్లర్ కాన్సెప్ట్ తో న్యూ మూవీ
కెరీర్ మొదలైనప్పుడు ఒక సక్సెస్ వస్తే ఏ హీరో అయినా సరే వరుసగా ఆఫర్లు అందుకోవాదం సహజమే. ఇక బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందితే ఇక వారికి ఇండస్ట్రీలో ఒక మార్కెట్ సెట్టయినట్లే అని చెప్పవచ్చు. అయితే ఎంతో కష్టపడి పైకొచ్చిన రాజ్ తరుణ్ బ్యాడ్ లక్ ఏమిటో గాని ఈ మధ్య వరుసగా అపజయాలు ఎదుర్కొంటున్నాడు. అలాగే చేసిన సినిమాలు కూడా థియేటర్స్ వరకు రావడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.
లాక్ డౌన్ కారణంగా రాజ్ తరుణ్ ఒరేజ్ బుజ్జిగా సినిమా వాయిదా పడుతూ చివరికి ఓటీటీలోనే విడుదలైంది. ఇక ఆ సినిమా దర్శకుడు విజయ్ కుమార్ కొండ దర్శకత్వంలోనే 'పవర్ ప్లే' అనే మరో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. రొటీన్ సినిమాలను పక్కనపెట్టి అల్లరి నరేష్ తరహాలో డిఫరెంట్ గా ట్రై చేసేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు అనిపిస్తోంది. మొదటిసారి ఈ లవర్ బాయ్ త్రిల్లర్ కథను టచ్ చేస్తున్నాడు.
థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమాను వీలైనంత త్వరగా రిలీజ్ చేయాలని అనుకున్నారు. సంక్రాంతి సందర్భంగా సినిమాకు సంబంధించిన స్పెషల్ మోషన్ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ఈ సినిమాలో హేమాల్, పూర్ణ, అజయ్, కోట శ్రీనివాసరావు వంటి వారి నటిస్తుండగా విజయ్ కుమార్ కొండ దర్శకత్వం వహిస్తున్నారు. మరి ఈ జానర్ లో రాజ్ తరుణ్ బాక్సాఫీస్ హిట్ అందుకుంటాడో లేదో చూడాలి.