ముడు సినిమాలను లైన్ లో పెట్టిన రాజశేఖర్.. కేరాఫ్ కంచరపాలెం దర్శకుడితో కూడా..
సీనియర్ హీరో రాజశేఖర్ మరోసారి స్పీడ్ పెంచారు. వరుస అపజాయలతో ఆ మధ్య కాస్త స్లో అయిన రాజశేఖర్ వెంటనే గరుడవేగ సినిమాతో మళ్ళీ ట్రాక్ లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఆ తరువాత ఎన్నో ఆఫర్స్ వచ్చినప్పటికీ కమర్షియల్ రొటీన్ సినిమాలు చేయకూడదని కొన్నిటిని రిజెక్ట్ చేశారు. ఇక యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో కల్కి అనే సినిమా చేసిన విషయం తెలిసిందే.
కల్కి సినిమా ఓ వర్గం ఆడియెన్స్ నుంచి పాజిటివ్ టాక్ అందుకున్నప్పటికి బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రాఫిట్స్ ను అందుకోలేకపోయింది. ఇక మళ్ళీ కొంత గ్యాప్ తీసుకున్న ఈ సినియట్ హీరో ఇప్పుడు మాత్రం స్పీడ్ పెంచేశాడు. ఒకేసారి మూడు సినిమాలను ట్రాక్ లోకి తెచ్చాడు. ఇటీవల మర్మానువు అనే కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కేరాఫ్ కంచరపాలెం దర్శకుడు వెంకటేష్ మహా తెరకెక్కించబోయే ఆ సినిమా సమ్మర్ లోనే సెట్స్ పైకి రానుంది.

ఇక ఇదివరకే రాజశేఖర్ తన పుట్టినరోజు సందర్భంగా రెండు సినిమాలపై క్లారిటీ ఇచ్చేశాడు. మలయాళం హిట్ సినిమా ఒకటి తెలుగులో రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే. ఆ సినిమా షూటింగ్ ఇప్పటికే కొంత పూర్తయ్యింది. అలాగే గతం ఫేమ్ కిరణ్ తో కూడా ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్నట్లు క్లారటీ ఇచ్చేశాడు. ఆ సినిమా షూటింగ్ త్వరలోనే యూఎస్ లో మొదలు కానుంది. ఈ విధంగా రాజశేఖర్ 2021లో వరుసగా మూడు సినిమాలతో సందడి చేయబోతున్నాడు. మరి ఆ సినిమాలు ఏ రేంజ్ లో హిట్టవుతాయో చూడాలి.


Click it and Unblock the Notifications











