Don't Miss!
- Finance Adani-Birla: అదానీని టార్గెట్ చేసిన బిర్లా.. ఆ సిమెంట్ ఫ్యాక్టరీ కొనుగోలు..
- Automobiles ట్రాఫిక్లో ఉన్నప్పుడు ఈ పొరపాట్లు చేశారో.. ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- News ఎన్నికల ఏజెంట్లుగా వాలంటీర్లు - సీన్ రివర్స్...!!
- Sports రుతురాజ్ చెత్త రికార్డు.. చరిత్రలో ఒకే ఒక్కడు!
- Technology Nokia 225 4G 2024 మోడల్ ధర, స్పెసిఫికేషన్లు మరియు డిజైన్ లీక్! వివరాలు
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
ముడు సినిమాలను లైన్ లో పెట్టిన రాజశేఖర్.. కేరాఫ్ కంచరపాలెం దర్శకుడితో కూడా..
సీనియర్ హీరో రాజశేఖర్ మరోసారి స్పీడ్ పెంచారు. వరుస అపజాయలతో ఆ మధ్య కాస్త స్లో అయిన రాజశేఖర్ వెంటనే గరుడవేగ సినిమాతో మళ్ళీ ట్రాక్ లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఆ తరువాత ఎన్నో ఆఫర్స్ వచ్చినప్పటికీ కమర్షియల్ రొటీన్ సినిమాలు చేయకూడదని కొన్నిటిని రిజెక్ట్ చేశారు. ఇక యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో కల్కి అనే సినిమా చేసిన విషయం తెలిసిందే.
కల్కి సినిమా ఓ వర్గం ఆడియెన్స్ నుంచి పాజిటివ్ టాక్ అందుకున్నప్పటికి బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రాఫిట్స్ ను అందుకోలేకపోయింది. ఇక మళ్ళీ కొంత గ్యాప్ తీసుకున్న ఈ సినియట్ హీరో ఇప్పుడు మాత్రం స్పీడ్ పెంచేశాడు. ఒకేసారి మూడు సినిమాలను ట్రాక్ లోకి తెచ్చాడు. ఇటీవల మర్మానువు అనే కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కేరాఫ్ కంచరపాలెం దర్శకుడు వెంకటేష్ మహా తెరకెక్కించబోయే ఆ సినిమా సమ్మర్ లోనే సెట్స్ పైకి రానుంది.
ఇక ఇదివరకే రాజశేఖర్ తన పుట్టినరోజు సందర్భంగా రెండు సినిమాలపై క్లారిటీ ఇచ్చేశాడు. మలయాళం హిట్ సినిమా ఒకటి తెలుగులో రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే. ఆ సినిమా షూటింగ్ ఇప్పటికే కొంత పూర్తయ్యింది. అలాగే గతం ఫేమ్ కిరణ్ తో కూడా ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్నట్లు క్లారటీ ఇచ్చేశాడు. ఆ సినిమా షూటింగ్ త్వరలోనే యూఎస్ లో మొదలు కానుంది. ఈ విధంగా రాజశేఖర్ 2021లో వరుసగా మూడు సినిమాలతో సందడి చేయబోతున్నాడు. మరి ఆ సినిమాలు ఏ రేంజ్ లో హిట్టవుతాయో చూడాలి.