Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ముడు సినిమాలను లైన్ లో పెట్టిన రాజశేఖర్.. కేరాఫ్ కంచరపాలెం దర్శకుడితో కూడా..
సీనియర్ హీరో రాజశేఖర్ మరోసారి స్పీడ్ పెంచారు. వరుస అపజాయలతో ఆ మధ్య కాస్త స్లో అయిన రాజశేఖర్ వెంటనే గరుడవేగ సినిమాతో మళ్ళీ ట్రాక్ లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఆ తరువాత ఎన్నో ఆఫర్స్ వచ్చినప్పటికీ కమర్షియల్ రొటీన్ సినిమాలు చేయకూడదని కొన్నిటిని రిజెక్ట్ చేశారు. ఇక యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో కల్కి అనే సినిమా చేసిన విషయం తెలిసిందే.
కల్కి సినిమా ఓ వర్గం ఆడియెన్స్ నుంచి పాజిటివ్ టాక్ అందుకున్నప్పటికి బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రాఫిట్స్ ను అందుకోలేకపోయింది. ఇక మళ్ళీ కొంత గ్యాప్ తీసుకున్న ఈ సినియట్ హీరో ఇప్పుడు మాత్రం స్పీడ్ పెంచేశాడు. ఒకేసారి మూడు సినిమాలను ట్రాక్ లోకి తెచ్చాడు. ఇటీవల మర్మానువు అనే కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కేరాఫ్ కంచరపాలెం దర్శకుడు వెంకటేష్ మహా తెరకెక్కించబోయే ఆ సినిమా సమ్మర్ లోనే సెట్స్ పైకి రానుంది.
ఇక ఇదివరకే రాజశేఖర్ తన పుట్టినరోజు సందర్భంగా రెండు సినిమాలపై క్లారిటీ ఇచ్చేశాడు. మలయాళం హిట్ సినిమా ఒకటి తెలుగులో రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే. ఆ సినిమా షూటింగ్ ఇప్పటికే కొంత పూర్తయ్యింది. అలాగే గతం ఫేమ్ కిరణ్ తో కూడా ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్నట్లు క్లారటీ ఇచ్చేశాడు. ఆ సినిమా షూటింగ్ త్వరలోనే యూఎస్ లో మొదలు కానుంది. ఈ విధంగా రాజశేఖర్ 2021లో వరుసగా మూడు సినిమాలతో సందడి చేయబోతున్నాడు. మరి ఆ సినిమాలు ఏ రేంజ్ లో హిట్టవుతాయో చూడాలి.