Don't Miss!
- News అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ షురూ: బారులు తీరిన ఓటర్లు
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
రీమేక్లో నటించబోతున్న రామ్.. చిన్న సినిమాగా విడుదలై!
ఎనర్జిటిక్ హీరో రామ్ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శత్వంలో ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో నభా నటేష్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. నేను శైలజ చిత్రం తర్వాత రామ్ కు సరైన హిట్ లేదు. దీనితో తన తదుపరి చిత్రాలపై దృష్టి పెడుతున్నాడు. ఇస్మార్ట్ శంకర్ చిత్రం తర్వాత రామ్ ఓ తమిళ సినిమా రీమేక్ లో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇటీవల అరుణ్ విజయ్ హీరోగా నటించిన థడమ్ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం ఘనవిజయం దిశగా దూసుకుపోతోంది. తక్కువ బడ్జెట్ లో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటికే 15 కోట్లు రాబట్టినట్లు తెలుస్తోంది. ఈ చిత్ర రీమేక్ హక్కులని రామ్ పెదనాన్న స్రవంతి రవికిశోర్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. రామ్ ఇస్మార్ట్ శంకర్ చిత్రాన్ని పూర్తి చేయగానే థడమ్ రీమేక్ ప్రారంభించాలనే ఆలోచనలో స్రవంతి రవికిషోర్ ఉన్నట్లు తెలుస్తోంది.
ఠాగూర్ మధు కూడా ఈ చిత్రాన్ని నిర్మాణంలో భాగస్వామ్యం కాబోతున్నారట. దర్శకుడు, నటీనటులకు సంబంధించిన వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. ఇక ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో మునుపెన్నడూ లేని విధంగా రామ్ రఫ్ లుక్ లో కనిపించబోతున్నాడు. పూరి జగన్నాథ్ తన సొంత బ్యానర్లోనే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. మణిశర్మ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.