Don't Miss!
- News సుమలత దెబ్బకు మాజీ సీఎం హడల్, ఇంతవరకు ప్రచారం చెయ్యలేదు, అసలు మ్యాటర్ !
- Sports IPL 2024: చరిత్ర సృష్టించిన సన్రైజర్స్ హైదరాబాద్!
- Technology Whatsapp File Sharing Feature వాట్సాప్లో కొత్త ఫీచర్.. సులభంగా ఫైల్స్ షేర్ చేసుకోవచ్చు..!
- Lifestyle మీ భార్యతో ఇలా ఎప్పుడైనా ఉన్నారా..? ఆ విషయంలో భర్త తగ్గాల్సిందే..!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
రీమేక్లో నటించబోతున్న రామ్.. చిన్న సినిమాగా విడుదలై!
ఎనర్జిటిక్ హీరో రామ్ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శత్వంలో ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో నభా నటేష్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. నేను శైలజ చిత్రం తర్వాత రామ్ కు సరైన హిట్ లేదు. దీనితో తన తదుపరి చిత్రాలపై దృష్టి పెడుతున్నాడు. ఇస్మార్ట్ శంకర్ చిత్రం తర్వాత రామ్ ఓ తమిళ సినిమా రీమేక్ లో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇటీవల అరుణ్ విజయ్ హీరోగా నటించిన థడమ్ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం ఘనవిజయం దిశగా దూసుకుపోతోంది. తక్కువ బడ్జెట్ లో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటికే 15 కోట్లు రాబట్టినట్లు తెలుస్తోంది. ఈ చిత్ర రీమేక్ హక్కులని రామ్ పెదనాన్న స్రవంతి రవికిశోర్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. రామ్ ఇస్మార్ట్ శంకర్ చిత్రాన్ని పూర్తి చేయగానే థడమ్ రీమేక్ ప్రారంభించాలనే ఆలోచనలో స్రవంతి రవికిషోర్ ఉన్నట్లు తెలుస్తోంది.
ఠాగూర్ మధు కూడా ఈ చిత్రాన్ని నిర్మాణంలో భాగస్వామ్యం కాబోతున్నారట. దర్శకుడు, నటీనటులకు సంబంధించిన వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. ఇక ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో మునుపెన్నడూ లేని విధంగా రామ్ రఫ్ లుక్ లో కనిపించబోతున్నాడు. పూరి జగన్నాథ్ తన సొంత బ్యానర్లోనే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. మణిశర్మ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.