Don't Miss!
- News పవన్ కళ్యాణ్ను మెచ్చుకున్న చంద్రబాబు
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
కొత్త ప్రాజెక్టు విషయంలో రామ్ డేరింగ్ స్టెప్: ఆ హీరోల బాటలో నడిచేందుకే ఇలా
వరుస హిట్లను అందుకుంటూ ఫుల్ స్వింగ్లో కనిపిస్తున్నాడు ఎనర్జిటిక్ స్టార్ ఉస్తాద్ రామ్ పోతినేని. దీంతో రెట్టించిన ఉత్సాహంతో సినిమాలను లైన్లో పెట్టుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం కోలీవుడ్ మాస్ డైరెక్టర్గా పేరొందిన లింగుసామీతో ఓ సినిమాను ప్రకటించాడు. అది ఎప్పుడో ప్రారంభం కావాల్సి ఉన్నా.. కరోనా కారణంగా ఇంకా మొదలవలేదు. ఆ హడావిడి తగ్గిన వెంటనే దీన్ని పట్టాలెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో రామ్ పోతినేని కొత్త ప్రాజెక్టు గురించి ఓ ఆసక్తికరమైన వార్త ఫిలిం నగర్ ఏరియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
రామ్ పోతినేని - లింగుసామీ కాంబినేషన్లో రాబోతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ను తెలుగు, తమిళ భాషల్లో రూపొందించబోతున్నారని చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. అయితే, తాజా సమాచారం ప్రకారం.. దీన్ని ఈ రెండు భాషలతో పాటు కన్నడం, మలయాళం భాషల్లో కూడా తెరకెక్కిస్తారని తెలిసింది. అదే సమయంలో హిందీలోకి కూడా తీసుకెళ్లే ఆలోచన చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. టాలీవుడ్లో ఇప్పటికే చాలా మంది హీరోలు పాన్ ఇండియా బాట పట్టారు. ఈ నేపథ్యంలో హీరో రామ్ కూడా ఈ డేరింగ్ స్టెప్ వేయబోతున్నాడనే టాక్ వినిపిస్తోంది.
ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాలో రామ్ రెండు విభిన్నమైన పాత్రల్లో నటిస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. అందులో ఒకటి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్ అని అంటున్నారు. ఇక, ఇందులో కోలీవుడ్ సీనియర్ స్టార్ హీరో మాధవన్ విలన్గా నటిస్తున్నాడని ఇటీవలే ఓ న్యూస్ బయటకు వచ్చింది. అలాగే, ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్గా నటిస్తుండగా.. సీనియర్ హీరోయిన్ నదియా కూడా కీలక పాత్రను పోషిస్తుందట. దీన్ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. దీనికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చుతున్నాడు.