Don't Miss!
- News ఎస్..ఇదే కడప, రాయలసీమ కల్చర్ - సీఎం జగన్..!!
- Automobiles వెనుక నుంచి ఢీ కొట్టిన ట్రక్.. ప్రమాదానికి గురైన Hyundai Exter - వీడియో
- Finance SBI MF: ప్రైవేట్ బ్యాంక్ దెబ్బతో రూ. 1,200 కోట్లకు పైగా నష్టపోయిన ఎస్బీఐ మ్యుచువల్ ఫండ్..
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
Ram Pothineni రికార్డు స్థాయి రెమ్యూనరేషన్: ఒక్కసారిగా పెంచేసిన ఉస్తాద్ హీరో
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోల్లో ఉస్తాద్ రామ్ పోతినేని ఒకడు. చాలా కాలం క్రితమే సినిమాల్లోకి ప్రవేశించిన అతడు.. ఆరంభంలో లవర్ బాయ్ ఇమేజ్ను సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత కుటుంబ కథా చిత్రాలతో లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ను పెంచుకున్నాడు. ఇక, పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన 'ఇస్మార్ట్ శంకర్' చిత్రంతో మాస్ హీరోగా గుర్తింపు పొందాడు. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. దీని తర్వాత వచ్చిన 'రెడ్' కూడా సూపర్ హిట్ అయింది. దీంతో రామ్ మార్కెట్ అమాంతం పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో అతడు రెమ్యూనరేషన్ పెంచేశాడట.
ప్రస్తుతం రామ్ పోతినేని.. కోలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ లింగుసామీతో ఓ ద్విభాషా చిత్రం చేస్తున్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమా కోసం ఈ హీరో రికార్డు స్థాయిలో రూ. 10 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడని తాజాగా ఓ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఇప్పటి వరకూ ఏ సినిమాకూ రామ్ ఇంత మొత్తాన్ని చార్జ్ చేయలేదు. కానీ, ఇప్పుడు రెండు సినిమాలు హిట్ అవడంతో పాటు ఈ మూవీ తెలుగు, తమిళ భాషల్లో రాబోతుంది. అందుకే ఈ ఎనర్జిటిక్ స్టార్ హీరో ఒక్కసారిగా రెమ్యూనరేషన్ పెంచేశాడనే టాక్ జోరుగా వినిపిస్తోంది.
మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందనున్న ఈ సినిమాలో రామ్ రెండు విభిన్నమైన పాత్రలను చేస్తున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. అందులో ఒకటి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్ అని ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉండగా.. భారీ స్థాయిలో తెరకెక్కనున్న ఈ సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. ఇందులో కోలీవుడ్ సీనియర్ స్టార్ హీరో మాధవన్ విలన్గా నటిస్తున్నాడట. అలాగే, ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్గా నటిస్తోంది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.