Don't Miss!
- Technology వన్ప్లస్ 13 స్మార్ట్ఫోన్ కీలక వివరాలు లీక్.. 6.8 అంగుళాల డిస్ప్లే, 50MP కెమెరా సహా.. పూర్తి వివరాలు..!
- Sports KKR Playing XI: రూ. 24.75 కోట్ల ఆటగాడిపై వేటు! పంజాబ్తో తలపడే కేకేఆర్ తుది జట్టు ఇదే!
- News మరో ఎమ్మెల్సీ ఉపఎన్నికకు షెడ్యూల్ విడుదల: బరిలో తీన్మార్ మల్లన్న
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా రామ్ పోతినేని: గతంలో చూడని గెటప్తో ఎనర్జిటిక్ హీరో
చాలా కాలం పాటు వరుస పరాజయాలతో సతమతమై.. పూరీ జగన్నాథ్ రూపొందించిన 'ఇస్మార్ట్ శంకర్'తో కెరీర్లోనే భారీ విజయాన్ని అందుకున్నాడు ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని. ఈ సినిమా హిట్ టాక్తో పాటు రికార్డు కలెక్షన్లతో సత్తా చాటింది. దీని తర్వాత అంటే ఈ సంక్రాంతికి 'రెడ్' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో విజయాన్ని అందుకున్నాడతను. ఈ సినిమా ఫలితాలు ఇచ్చిన జోష్లోనే మరో ప్రాజెక్టును ప్రకటించాడీ యంగ్ హీరో. దీన్ని కోలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ లింగుసామీ రూపొందించనున్నాడు. తాజాగా ఈ మూవీ గురించి ఓ న్యూస్ బయటకు వచ్చింది.
వరుస విజయాలతో దూసుకుపోతోన్న రామ్ పోతినేని ప్రస్తుతం లింగుసామీతో ఓ సినిమాను చేయబోతున్న విషయం తెలిసిందే. తెలుగు, తమిళంలో రూపొందనున్న ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్గా రాబోతుందట. తాజా సమాచారం ప్రకారం.. ఇందులో హీరో రామ్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా నటించబోతున్నాడని తెలిసింది. అది కూడా ఇప్పటి వరకూ కనిపించని డిఫరెంట్ గెటప్తో దర్శనమివ్వనున్నాడని అంటున్నారు. ఇందుకోసం అతడు జిమ్లో ప్రత్యేకమైన కసరత్తులు కూడా చేస్తున్నాడని తెలుస్తోంది. అలాగే, గన్ ఫైరింగ్లోనూ శిక్షణ తీసుకుంటున్నాడని టాక్.
ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ ద్విభాషా చిత్రంలో 'ఉప్పెన' హీరోయిన్ కృతి శెట్టి నటిస్తున్నట్లు ఇటీవలే ప్రకటించింది చిత్ర యూనిట్. ఆమెతో పాటు సీనియర్ హీరోయిన్ నదియా కూడా కీలక పాత్రను పోషిస్తుందట. వీళ్లతో పాటు 'గ్యాంగ్ లీడర్' ఫేం ప్రియాంక అరుల్ మోహన్ కూడా ఓ స్పెషల్ రోల్ చేయనుందన్న టాక్ వినిపిస్తోంది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్పై శ్రీనివాస చిట్టూరి దీన్ని నిర్మిస్తున్నారు. టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నాడు. ఇది త్వరలోనే విశాఖపట్నంలో రెగ్యూలర్ షూటింగ్ జరుపుకోనుంది.