Don't Miss!
- Automobiles సేఫ్టీలో మహీంద్రా బొలెరో నియోకు కేవలం 1-స్టార్ రేటింగ్.. దీనిపై కంపెనీ ఏమందంటే??
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- Sports ఆ చెత్త నిర్ణయమే ఆర్సీబీ కొంపముంచింది- ఫించ్
- News ముందస్తుగానే ఏపీ ఎన్నికల ఫలితాలు - గెలుపెవరిది..!!
- Finance Debt Free: అప్పుల ఊబి నుంచి త్వరగా బయటపడాలా..?? ఇవిగో 5 మార్గాలు..
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
- Travel ఏపీలోని రైలు ప్రయాణికులకు శుభవార్త..వేసవి ప్రత్యేక రైళ్లు ఆగే స్టేషన్లివే..!
మూడున్నర కోట్ల మంది చూశారు: హీరో రామ్ సినిమా సరికొత్త రికార్డ్
రామ్ హీరోగా నటించిన 'ఉన్నది ఒకటే జిందగీ' సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాను గోల్డ్మైన్స్ టెలీఫిలిమ్స్ సంస్థ హిందీలోకి అనువదించి యూట్యూబ్లో విడుదల చేయగా వారం కూడా తిరక్కముందే మూడున్నరకోట్ల మంది వీక్షించారు.
'నెం.1 దిల్ వాలా' పేరుతో దీన్ని రిలీజ్ చేయగా హిందీ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. దాదాపు నాలుగున్నర లక్షల లైక్ వచ్చాయి. రామ్ సినిమాకు ఇంత తక్కువ సమయంలో ఈ స్థాయి రెస్పాన్స్ రావడం అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. ఈ మూవీ ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.
'ఉన్నది ఒకటే జిందగీ' చిత్రానికి కిశోర్ తిరుమల దర్శకత్వం వహించారు. స్రవంతి సినిమాటిక్స్ పతాకంపై స్రవంతి రవికిశోర్, కృష్ణ చైతన్య సంయుక్తంగా నిర్మించారు. అనుపమ పరమేశ్వరన్, లావణ్య త్రిపాఠి హీరోయిన్లుగా నటించగా శ్రీవిష్ణు ముఖ్య పాత్ర పోషించారు.
ప్రస్తుతం రామ్ 'ఇస్మార్ట్ శంకర్' అనే చిత్రంలో నటిస్తున్నారు. పూరి జగన్నాధ్ దర్శకత్వం వహిస్తున్నీ ఈ చిత్రంలో నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్లు. ప్రస్తుతం హైదరాబాద్ లో శెరవేగంగా షూటింగ్ జరుగుతుండగా, భారీ యాక్షన్ సీక్వెన్స్ లను ఈ షెడ్యూల్ లో తెరకెక్కిస్తున్నారు.. రామ్ సరికొత్తగా, స్టైలిష్ గా కనిపిస్తున్న ఈ చిత్రం లో పునీత్ ఇస్సార్, సత్య దేవ్, మిలింద్ గునాజి, ఆశిష్ విద్యార్థి మరియు గెటప్ శ్రీను ఇతర పాత్రల్లో నటిస్తున్నారు,