Don't Miss!
- News కేసీఆర్ భరోసా: 22 నుంచి బస్సు యాత్రతో జనంలోకి
- Sports భార్య పేరు చెప్పి.. DK నోరు మూయించిన కోహ్లి Video
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
చిన్నచూపుతో ఎగతాళి చేసేవారు.. ఇప్పుడు సత్తా తెలిసింది.. రానా
తెలుగు సినిమా పరిశ్రమ ఎదుగుదలపై రానా దగ్గుబాటి సెన్సేషనల్ కామెంట్ చేశారు. బాలీవుడ్ చిత్ర పరిశ్రమ ప్రస్తుతం దక్షిణాది వైపు చూస్తున్నది. ఇక్కడి చిత్రాలు సాధిస్తున్న విజయాలు, నిర్మిస్తున్న తీరు, కథలు హిందీ పరిశ్రమను విశేషంగా ఆకర్షిస్తుండటం మంచి పరిణామం అని రానా అన్నారు. గతంలో బాహుబలి, టెంపర్ లాంటి చిత్రాలు బాలీవుడ్లో రీమేక్ అయి ఘన విజయాలు సాధించడంతో సౌత్ సత్తా తెలిసిందన్నారు.
ఇటీవల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇంతకు ముందు దక్షిణాది చిత్ర పరిశ్రమ అంటే చిన్నచూపు ఉండేది. ఎగతాలిగా చూసేవారు. ఇప్పుడు పరిస్థితి మారింది. అమితాబ్, అక్షయ్ కుమార్, షారుఖ్ లాంటి వాళ్లు దక్షిణాది సినిమాపై కన్నేయడం ఇక్కడి సినిమాల్లో దమ్ము ఉండటమే కారణం అని రానా అన్నారు.
తాజాగా కబీర్ సింగ్ సినిమాపై కూడా స్పందించారు. కబీర్ సింగ్ సాధిస్తున్న కలెక్షన్లపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఈ సినిమాను దేశవ్యాప్తంగా చూశారు. అయినా హిందీలో నిర్మించగా మళ్లీ అద్భుతమైన స్పందన కనిపిస్తున్నదని రానా పేర్కొన్నారు.
కబీర్ సింగ్ గురించి నాకు ఓ మిత్రుడి నుంచి ఆసక్తికరమైన రిపోర్ట్ వచ్చింది. సినిమా రిలీజ్కు ముందు వేసిన పెయిడ్ ప్రివ్యూలకు దేశవ్యాప్తంగా చూస్తే హైదరాబాద్లోనే అత్యధికంగా వసూళ్లు నమోదయ్యాయి. అది నాకు షాక్ కలిగించింది అని రానా అన్నారు.
బాహుబలి తర్వాత రానా దగ్గుబాటి ఇమేజ్ దేశవ్యాప్తంగా పెరిగిపోయింది. దాంతో జాతీయస్థాయి ప్రాజెక్టులు ఆయన ముందు క్యూ కట్టాయి. బాహుబలి తర్వాత ఆ రేంజ్ స్థాయి ఉన్న సినిమాల్లో నటించేందుకు ప్రయత్నిస్తున్నారు. హాథీ మేరి సాథీ, 1945, హౌస్ఫుల్ 4 లాంటి చిత్రాల్లో నటిస్తున్నారు.