Don't Miss!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- News బాలకృష్ణకు షాక్: హిందూపురంలో నామినేషన్ వేసిన స్వామి పరిపూర్ణానంద
- Sports CSK vs LSG: శతక్కొట్టిన రుతురాజ్ గైక్వాడ్.. చితక్కొట్టిన శివమ్ దూబే!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
సైంటిఫిక్ థ్రిల్లర్తో రవితేజ ప్రయోగం.. ముగ్గురు హీరోయిన్లతో రొమాన్స్!
మాస్ మహారాజ రవితేజ ప్రయోగాల బాట పట్టాడు. రవితేజ ప్రస్తుతం శ్రీనువైట్ల దర్శత్వంలో అమర్ అక్బర్ ఆంటోని చిత్రంలో నటిస్తున్న సంగతి తేలింది. రవితేజ మూడు పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం వైవిధ్యంగా ఉండబోతోంది. రవితేజ తదుపరి నటించే చిత్రం కూడా పూర్తి స్థాయి ప్రయోగాత్మకంగా ఉండబోతోంది. అమర్ అక్బర్ ఆంటోని తరువాత రవితేజ ఎక్కడికి పోతావు చిన్నవాడా ఫేమ్ విఐ ఆనంద్ దర్శత్వంలో నటించబోతున్నాడు.
అతీంద్రీయ శక్తుల అంశంతో సినిమాలు తీయడంలో విఐ ఆనంద్ సిద్ధహస్తుడు. ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఒక్క క్షణం చిత్రాలు ఆ తరహాకి చెందినవే. రవితేజతో తెరక్కించబోయే చిత్రం కూడా సైంటిఫిక్ థ్రిల్లర్ కథాంశంతో ప్రయోగాత్మకంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ చిత్రంలో రవితేజ సరసన ముగ్గురు హీరోయిన్లు నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఓ హీరోయిన్ గా నభా నటేష్ ఎంపికైనట్లు తెలుస్తోంది. ఇటీవల విడుదలైన నన్ను దోచుకుందువటే చిత్రంలో నభా నటేష్ ఆకట్టుకుంది. అమర్ అక్బర్ ఆంటోని చిత్రం పూర్తి కాగానే రవితేజ తదుపరి చిత్రాన్ని ప్రారంభించనున్నాడు.