Don't Miss!
- News కాలేజ్ క్యాంపస్ లో పోలిటికల్ లీడర్ కూతురి హత్య, కన్న కూతుర్ని ఎవరు ఎలా చంపారో చెప్పిన లీడర్ !
- Finance Amazon News: అమెజాన్ సీక్రెట్ స్టోర్.. ప్రాజెక్ట్ క్యూరియాసిటీ వివరాలివే..
- Automobiles కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- Lifestyle భార్యా భర్త గొడవపడినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Technology Samsung నుంచి 'Music Frame' స్పీకర్ లు లాంచ్! ప్రత్యేకతలేంటి. ధర వివరాలు
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
కలర్ ఫోటో డైరెక్టర్ను ప్రశంసించిన రవితేజ్.. దటీజ్ మాస్ మహారాజా!
గత వారం నుంచి కలర్ ఫోటో సినిమా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. సినిమాపై మంచి టాక్ వస్తోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ మూవీ గురించి పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి. నెటిజన్లను తెగ ఆకట్టుకున్న ఈ సినిమా సెలెబ్రిటీలను సైతం మైమరిపిస్తోంది. సున్నితమైన భావోద్వేగాలు, అందమైన ప్రేమ కథను అద్భుతంగా మలిచిన తీరుకు అందరూ ఫిదా అవుతున్నారు. అందుకే మాస్ మహారాజా రవితేజ్ కూడా కలర్ ఫోటోపై ప్రశంసలు కురిపించాడు.
మామూలుగా కింది స్థాయి నుంచి ఎదిగిన హీరో, కష్టం విలువ తెలిసిన వాడు కాబట్టి మాస్ మహారాజా రవితేజకు ఇలా కొత్త వారు అద్భుతాలు సృష్టిస్తే ఆనందం కలగడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. అందుకే కలర్ ఫోటోను అంత అద్భుతంగా మలిచిన దర్శకుడు సందీప్ రాజ్ను ప్రత్యేకంగా కలిసి అభినందించాడు. సందీప్ను కలిసి సినిమా గురించి కాసేపు ముచ్చటించాడు. తెరెక్కించిన తీరును ప్రశంసించినట్టు తెలుస్తోంది.
ఓ వైపు రవితేజ తన క్రాక్ సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. వరలక్ష్మీ శరత్ కుమార్ షూటింగ్కు బై చెప్పినట్టు తెలుస్తోంది. తన పార్ట్ పూర్తి అవ్వడంతో క్రాక్ యూనిట్ నుంచి వీడ్కోలు తీసుకుంది. మరో వైపు సినిమా డబ్బింగ్ పనులు కూడా మొదలయ్యాయి. మామూలుగా అయితే సమ్మర్ స్పెషల్గా రావాల్సిన ఈ సినిమా కరోనా లాక్ డౌన్ వల్ల వాయిదా పడుతూ వచ్చింది. మొత్తానికి ఇప్పుడు సినిమా పూర్తి కాబోతోంది. విడుదల తేదీని త్వరలో ప్రకటించే అవకాశముంది.