Don't Miss!
- Sports PBKS vs MI: ఆ తప్పిదంతోనే గెలిచే మ్యాచ్లో ఓడాం: సామ్ కరణ్
- News పొన్నూరు వైసీపీ అభ్యర్థి అంబటి మురళీపై చర్యలకు ఈసీ ఆదేశం
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
కలర్ ఫోటో డైరెక్టర్ను ప్రశంసించిన రవితేజ్.. దటీజ్ మాస్ మహారాజా!
గత వారం నుంచి కలర్ ఫోటో సినిమా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. సినిమాపై మంచి టాక్ వస్తోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ మూవీ గురించి పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి. నెటిజన్లను తెగ ఆకట్టుకున్న ఈ సినిమా సెలెబ్రిటీలను సైతం మైమరిపిస్తోంది. సున్నితమైన భావోద్వేగాలు, అందమైన ప్రేమ కథను అద్భుతంగా మలిచిన తీరుకు అందరూ ఫిదా అవుతున్నారు. అందుకే మాస్ మహారాజా రవితేజ్ కూడా కలర్ ఫోటోపై ప్రశంసలు కురిపించాడు.
మామూలుగా కింది స్థాయి నుంచి ఎదిగిన హీరో, కష్టం విలువ తెలిసిన వాడు కాబట్టి మాస్ మహారాజా రవితేజకు ఇలా కొత్త వారు అద్భుతాలు సృష్టిస్తే ఆనందం కలగడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. అందుకే కలర్ ఫోటోను అంత అద్భుతంగా మలిచిన దర్శకుడు సందీప్ రాజ్ను ప్రత్యేకంగా కలిసి అభినందించాడు. సందీప్ను కలిసి సినిమా గురించి కాసేపు ముచ్చటించాడు. తెరెక్కించిన తీరును ప్రశంసించినట్టు తెలుస్తోంది.
ఓ వైపు రవితేజ తన క్రాక్ సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. వరలక్ష్మీ శరత్ కుమార్ షూటింగ్కు బై చెప్పినట్టు తెలుస్తోంది. తన పార్ట్ పూర్తి అవ్వడంతో క్రాక్ యూనిట్ నుంచి వీడ్కోలు తీసుకుంది. మరో వైపు సినిమా డబ్బింగ్ పనులు కూడా మొదలయ్యాయి. మామూలుగా అయితే సమ్మర్ స్పెషల్గా రావాల్సిన ఈ సినిమా కరోనా లాక్ డౌన్ వల్ల వాయిదా పడుతూ వచ్చింది. మొత్తానికి ఇప్పుడు సినిమా పూర్తి కాబోతోంది. విడుదల తేదీని త్వరలో ప్రకటించే అవకాశముంది.