Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
శర్వానంద్ కోసం రవితేజ ఇంత త్యాగం చేశాడా? బయటికొచ్చిన ఇంట్రెస్టింగ్ న్యూస్
టాలీవుడ్ యంగ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ తాజాగా నటించిన చిత్రం 'రణరంగం'. 1980 - 90 దశకాలకు సంబంధించిన కథతో రూపొందిందీ సినిమా. ఈ సినిమాలో శర్వానంద్ సరసన కాజల్ అగర్వాల్, కళ్యాణి ప్రియదర్శన్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. సుధీర్ వర్మ దర్శకత్వం వహించారు. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ప్రశాంత్ పిళ్లై సంగీతం సమకూర్చారు. స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఆగస్టు 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
కొద్దిరోజుల క్రితం విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ఇందులో శర్వానంద్ లుక్, బాడీ లాంగ్వేజ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలాగే, ట్రైలర్లో చెప్పిన డైలాగులకు కూడా మంచి స్పందన వస్తోంది. దీంతో సినిమాపై అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో 'రణరంగం' సినిమా గురించి ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ప్రస్తుతం ఇది ఫిలింనగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.
'రణరంగం' కథ మొదట మాస్ మహారాజా రవితేజకు చెప్పాడట డైరెక్టర్ సుధీర్ వర్మ. దీనికి ఆయన గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశాడట. ప్రస్తుతం రవితేజ చేస్తున్న 'డిస్కోరాజా', అజయ్ భూపతి సినిమా తర్వాత దీన్ని పట్టాలెక్కిద్దాం అని సుధీర్కు హామీ ఇచ్చాడని సమాచారం. ఈ నేపథ్యంలో 'రణరంగం' కథ శర్వానంద్ దగ్గరకు రావడానికి వెనుక చాలా జరిగిందని ప్రచారం జరుగుతోంది.
దీని ప్రకారం.. రవితేజ ఒప్పుకున్న ప్రాజెక్టులు అయ్యే లోపు చాలా సమయం ఉండడంతో సుధీర్ వర్మ.. శర్వాతో సినిమా చేయాలని అనుకున్నాడట. ఇందులో భాగంగానే అతడికి ఓ కథను చెప్పాడని తెలిసింది. అది అంతగా నచ్చకపోవడంతో.. ఇంకేదైన కథ ఉంటే చెప్పమన్నాడట శర్వా. అప్పుడే సుధీర్ 'రణరంగం' కథను చెప్పాడట. అయితే, ఇది రవితేజ కోసం రాసుకున్నానని, ఆయన కూడా దీనికి ఓకే చెప్పేశాడని అన్నాడట.
ఆ తర్వాత శర్వానంద్.. నేరుగా రవితేజతో ఈ కథ తనకు ఇవ్వాలని కోరాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. యంగ్ హీరో అడిగిన వెంటనే రవితేజ త్యాగం చేశాడని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. దీంతో మాస్ మహారాజపై శర్వానంద్ ఫ్యాన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.