Don't Miss!
- Sports ముంబై ఇండియన్స్కు బిగ్ షాక్: ఆ ఇద్దరికీ కోత
- News సాగర్ టెయిల్ పాండ్ నుండి ఏపీ నీటిచౌర్యం; ఎన్నికలవేళ మళ్ళీ కృష్ణా జలవివాదం!!
- Finance Gold Price Today: బంగారం ధర పై పైకే.. ఇక కొనలేమా..!
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Automobiles హ్యుందాయ్ ఎక్స్టర్ దిమ్మ తిరిగే మైలేజ్.. ఓనర్ ఫుల్ ఖుష్.. ఫొటోలతో సహా ప్రూఫ్ ఇదిగో.!!
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
- Technology ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
ఎన్టీఆర్ ఎఫెక్ట్.. ఆలోచనలో అఖిల్!
అఖిల్ నటిస్తున్న తాజా చిత్రంమిస్టర్ మజ్ను. ఇటీవల ఏఎన్నార్ జయంతి సందర్భంగా విడుదలైన ఫస్ట్ లుక్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అమ్మాయిల చుట్టూ తిరిగే నాటీ బాయ్ లుక్ లో అఖిల్ అదరగొట్టాడు. మిస్టర్ మజ్నుఫస్ట్ లుక్ తో అందరిలో ఈ చిత్రంపై ఆసక్తి నెలకొంది. తొలి రెండు చిత్రాలు నిరాశ పరచడంతో ఈ సారి అఖిల్ యూత్ ని టార్గెట్ చేశాడు. తాజాగా మిస్టర్ మజ్ను చిత్రం విడుదల సమస్యల్లో చిక్కుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
సోలోగా రిపబ్లిక్ డే రోజు
తొలి ప్రేమ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న వెంకీ అట్లూరి మిస్టర్ మజ్ను చిత్రాన్ని తెరెకెక్కిస్తున్నాడు. సంక్రాంతి హడావిడి ముగిసాక రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26న మిస్టర్ మజ్ను చిత్రాన్ని విడుదల చేయాలని భావించారు.కానీ మిస్టర్ మజ్ను చిత్రం రిపబ్లిక్ డే విడుదల సందిగ్ధంలో పడ్డట్లు తెలుస్తోంది.
ఎన్టీఆర్ ఎఫెక్ట్
ఎన్టీఆర్ బయోపిక్ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రాన్ని జనవరి 9 న విడుదల చేస్తారు. రెండవ భాగం ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రాన్ని జనవరి 24న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. దీనితో మిస్టర్ మజ్ను చిత్రం ఎన్టీఆర్ బయోపిక్ తో పోటీ పడవలసి ఉంటుంది.
ఆలోచనలో అఖిల్
ఎన్టీఆర్ బయోపిక్ ప్రభావంతో మిస్టర్ మజ్ను చిత్ర యూనిట్ కొత్త విడుదల తేదీ కోసం పరిశీలిన మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. అనుకున్న సమయానికే చిత్రాన్ని విడుదల చేస్తారా లేక రిలీజ్ డేట్ మారుతుందా అనేది వేచి చూడాలి.
పట్టుదలతో
తొలి రెండు చిత్రాలు నిరాశ పరచడంతో మిస్టర్ మజ్ను చిత్రంతో విజయాన్ని అందుకోవాలని అఖిల్ పట్టుదలగా ఉన్నాడు. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. నిధికి అగర్వాల్ కథానాయిక.