ఉత్తరాంధ్రకు హీరో కార్తీకేయ చేయూత.. తుఫాన్ బాధితులకు 2 లక్షల విరాళం
తిత్లీ తుఫాన్ బారిన పడి తల్లడిల్లుతున్న ఉత్తరాంధ్రను ఆదుకొనేందుకు సినీ ప్రముఖులు ముందుకొస్తున్నారు. ఇప్పటికే పలువురు తమకు తోచిన ఆర్థిక సహాయాన్ని అందించారు. తాజాగా ఆర్ఎక్స్ 100 చిత్రంతో సంచలన హీరోగా పేరు సంపాదించుకొన్న కార్తీకేయ తన వంతుగా రూ.2 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించారు. తన సహాయాన్ని ఏపీ సీఎం సహాయనిధికి నేరుగా అందించారు.
నాకు ఫేవరేట్ ప్రాంతమైన ఉత్తరాంధ్రకు నా వంతు బాధ్యతను పూర్తిచేశాను. అక్కడి ప్రజలంటే నాకు చాలా ప్రేమ, ఇష్టం. అలాంటి వారు బాధల్లో ఉంటే నేను స్పందించకుండా ఉండలేకపోయాను. తిత్లీ తుఫాను బారిన పడటం బాధ కలిగించింది.

నా సహాయం పబ్లిసిటీ కోసం కాదు. ఉత్తరాంధ్ర ప్రజల కోసం భారంగా మారిన నా హృదయ స్పందన ఇది. శ్రీకాకుళం ప్రాంత ప్రజలకు అండగా నిలువాలని అనుకొన్నాను అని కార్తీకేయ ట్వీట్ చేశారు.


Click it and Unblock the Notifications











