Don't Miss!
- Technology Samsung నుంచి 'Music Frame' స్పీకర్ లు లాంచ్! ప్రత్యేకతలేంటి. ధర వివరాలు
- News వల్లభనేని వంశీకి షాకిచ్చేలా యార్లగడ్డతో చంద్రబాబు వ్యూహం!!
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
- Finance Medicines News: కిరాణా కొట్టులో మందుల విక్రయం.. మోదీ సర్కార్ సంచలన నిర్ణయం..!!
- Lifestyle ప్రాణాలకు ముప్పు ఉందని తెలిపే హీట్ స్ట్రోక్ లక్షణాలు
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
నేను జనసైనికుడిని, మామయ్య ఆరోగ్యమే ముఖ్యం, మెగా రిమిక్స్ ఇష్టం ఉండదు: సాయి ధరమ్ తేజ్
సాయి ధరమ్ తేజ్ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందిన మూవీ 'చిత్రలహరి'. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద తొలి రోజు పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. వరుస ప్లాపుల తర్వాత ఎట్టకేలకు సాయి ధరమ్ తేజ్ ఖాతాలో హిట్టు పడింది.
సినిమా విజయానందంలో ఉన్న చిత్ర బృందం మీడియా ఇంటర్వ్యూలో బిజీ అయిపోయారు. ఈ సందర్భంగా సాయి ధరమ్ తేజ్ ఓ ప్రశ్నకు స్పందిస్తూ... మెగా ఫ్యామిలీ నుంచి వచ్చాను అనే భావన ఏమీ ఉండదు, అందరితో సాధారణ వ్యక్తిలానే ఉండాలనుకుంటాను అన్నారు.
మా అమ్మ నన్ను అలాగే పెంచింది
అందరినీ గౌరవించాలి అనే మంచి అలవాట్లతో మా అమ్మ నన్ను పెంచింది. మోరల్ వ్యాల్యూస్, మహిళలకు గౌరవం ఇవ్వడం నేర్పింది. నేను మెగా ఫ్యామిలీ నుంచి వచ్చాను, అందరిలా కాకుండా మనం ప్రత్యేకంగా ఉండాలి అనే ఆలోచనల ఎప్పుడూరాదు. అలా ఉండటం నాకు ఇష్టం ఉండదు. సక్సెస్ వచ్చినా, ఫెయిల్యూర్ వచ్చినా ఒకేలా ఉండాలనేది నా అభిమతమని సాయి ధరమ్ తేజ్ అన్నారు.
చిరంజీవిగారి పాటలు రీమిక్స్ చేయడం ఇష్టం ఉండదు
నాకు బేసిగ్గా చిరంజీవిగారి పాటలు రీమిక్స్ చేయడం ఇష్టం ఉండదు. సాంగ్స్ వినడం ఇష్టం. ఆ పాటలు వింటుంటే చిరంజీవిగారు గుర్తు రావాలి... నన్ను ఆ పాటల్లో ఊహించుకోలేను. ఇప్పటి వరకు చేసిన రీమిక్స్ పాటలు డైరెక్టర్, ప్రొడ్యూసర్ కోరిక మేరకు చేసినవే. నా ఇష్టపూర్వకంగా, నేను కావాలని చేసినవి కావు అన్నారు.
‘చిత్రలహరి'కి అలాంటివి అవసరం లేదు
‘చిత్రలహరి' సినిమాకు అలాంటి రీమిక్స్ సాంగ్స్ అవసరం లేదు. కథ కూడా డిమాండ్ చేయలేదు. ఈ సినిమాకు మోరల్ వ్యాల్యూస్ అనేది చాలా ముఖ్యం. అందుకనే కిషోర్ ఎలాగంటే అలా చేసుకుంటూ వెళ్లిపోయాను. భవిష్యత్తులో కూడా రిమిక్స్ సాంగ్స్ చేసే ఆలోచన లేదన్నారు.
నేను జనసైనికుడిని, మామయ్య ఆరోగ్యమే ముఖ్యం
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని ఒక మంచి లీడర్గా నమ్ముతున్నాను. నేను కూడా ఒక జనసైనికుడిని. ఆయన ఈ సొసైటీ కోసం మంచి చేస్తారనే పూర్తి నమ్మకంతో ఉన్నాను. ఆయన ఆరోగ్యం బాగోలేకుంటే ఈ మధ్యే వెళ్లి కలిశాను. ముందు ఆయన ఆరోగ్యం ముఖ్యం, మా సినిమా ఎప్పుడైనా చూడొచ్చు. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను అని సాయి ధరమ్ తేజ్ తెలిపారు.