Don't Miss!
- Sports T20 World Cup 2024: సంజూ శాంసన్కు మళ్లీ అన్యాయమే!
- News మోదీని ప్రధానిని చెయ్యండి.. తెలంగాణాలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం: అమిత్ షా
- Technology వన్ప్లస్ 13 స్మార్ట్ఫోన్ కీలక వివరాలు లీక్.. 6.8 అంగుళాల డిస్ప్లే, 50MP కెమెరా సహా.. పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
సాయి ధరమ్ తేజ్ గొప్పమనసు, 150 మంది చిన్నారుల దత్తత!
మెగా ఫ్యామిలీకి చెందిన హీరో సాయి ధరమ్ తేజ్... ఫ్యామిలీ వారసత్వంతో సినిమా రంగంలో అడుగు పెట్టడమే కాదు, సేవా కార్యక్రమాల్లో సైతం మామయ్యలు చిరంజీవి, పవన్ కళ్యాణ్ను ఫాలో అవుతున్నాడు. గత కొన్ని సంవత్సరాలుగా థింక్ పీస్ ఆర్గనైజేషన్ అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి తన వంతు సహాయం అందిస్తున్నారు.
పేద, అనాధ పిల్లలకు విద్య, పౌష్టికాహారం అందించడం లక్ష్యంగా ఈ స్వచ్ఛంద సంస్థ పని చేస్తోంది. విరాళాలు సేకరించడం ద్వారా వీలైనంత ఎక్కువ మందికి పిల్లలకు సహాయం చేయడమే లక్ష్యంగా థింక్ పీస్ ఆర్గనైజేషన్ ముందుకు సాగుతోంది.
ఈ సంస్థతో అసోసియేట్ అయిన తేజ్.... మున్నిగూడలోని అక్షరాలయ స్కూల్ను దత్తత తీసుకున్నారు. దాదాపు 100 మందికిపైగా పిల్లలకు విద్యా, పౌష్టికాహార సంబంధమైన అవసరాల కోసం ఆర్థిక సహాయం అందిస్తున్నారు. ఈ ఏడాది అదనంగా మరో 50 మందిని దత్తత తీసుకున్నట్లు సాయి ధరమ్ తేజ్ తెలిపారు.
View this post on InstagramA post shared by sai tej (@jetpanja) on
ఆ పిల్లల సంతోషకరమైన ముఖాలను చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంటుంది. మీరు కూడా మీకు తోచిన సహాయం అందించండి అని సాయి ధరమ్ తేజ్ అభిమానులను, సినీ అభిమానులను రిక్వెస్ట్ చేశారు. విరాళాలు అందించాల్సిన లింకును ఇన్స్టాగ్రామ్ పేజీలో షేర్ చేశారు.
సాయి ధరమ్ తేజ్ సినిమా కెరీర్ గురించిన విషయాల్లోకి వెళితే... వరుస ప్లాపుల తర్వాత ఈ ఏడాది ప్రారంభంలో 'చిత్రలహరి' సినిమాతో హిట్ అందుకున్న ఈ మెగా మేనల్లుడు... తన తర్వాతి చిత్రం మారుతి దర్శకత్వంలో చేయబోతున్నారు. దీనికి 'ప్రతిరోజూ పండగే' అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.