Don't Miss!
- Sports T20లో డబుల్ సెంచరీ: ఆ భారత ప్లేయర్కే సాధ్యం- విలియమ్సన్
- Automobiles 5 రూపాయల గొడవ.. చిర్రెత్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రయాణికుడు.. అసలేం జరిగిందంటే.!!
- News తెలంగాణలో నామినేషన్లను దాఖలు చేసిన బీజేపీ ఎంపీ అభ్యర్థులు వీరే
- Technology Samsung నుంచి కొత్త 8K మరియు 4K AI టీవీ లు లాంచ్ అయ్యాయి! ధర, ఫీచర్లు, ఆఫర్లు
- Lifestyle Happy Birthday Wishes : పుట్టినరోజు శుభాకాంక్షలను ఇలా అందంగా తెలపండి..
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ఒక్క హిట్టుతో 30కోట్ల ప్లాన్.. సాయి ధరమ్ తేజ్ మామూలోడు కాదు!
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ లక్కేమిటో గాని అప్పుడప్పుడు దొరక్కుండా దోబూచులాడుతోంది. ఫైనల్ గా గత ఏడాది బాక్సాఫీస్ హిట్ తో ఫామ్ లోకి వచ్చిన సాయి ఇక నెక్స్ట్ సినిమాలను కూడా చాలా జాగ్రత్తగా సెట్ చేసుకుంటున్నాడు. వీలైనంత వరకు సేఫ్ జోన్ లో హిట్స్ అందుకోవడానికి అడుగులు వేస్తున్నట్లు అర్ధమవుతొంది. అలగే రెమ్యునరేషన్ డోస్ కూడా పెంచినట్లు తెలుస్తోంది.
బాక్సాఫీస్ హిట్..
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ గత ఏడాది ప్రతి రోజు పండగే సినిమాతో ఫామ్ లోకి వచ్చిన విషయం తెలిసిందే. మారుతి దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా సక్సెస్ ద్వారా ఈ హీరో తన మార్కెట్ ని కూడా పెంచుకున్నాడు. గత సినిమాలతో పట్టిన దరిద్రం ఈ సినిమాతో వదిలింది. రెమ్యునరేషన్ కూడా హెచ్చు తగ్గులు లేకుండా ఎప్పటిలానే అందుకుంటున్నాడు.
ఇంటిలిజెంట్ ఎఫెక్ట్..
వివి.వినాయక్ దర్శకత్వంలో బాచ్చిన ఇంటిలిజెంట్ సినిమాతో సాయి ధరమ్ తేజ్ ఊహించని డిజాస్టర్ ఎదుర్కొన్నాడు. ఆ సినిమా కోసం సాయి కేవలం రెండున్నర కోట్లు మాత్రమే తీసుకున్నాడు. అంతకుముందు వరకు ఈ మెగా హీరో 5కోట్ల వరకు అందుకునేవాడట. ఇక ఇంటిలిజెంట్ దెబ్బకు మార్కెట్ పడిపోవడంతో మారుతితో అద్భుతమైన కథను సెట్ చేసుకొని ఫామ్ లోకి వచ్చేశాడు.
టార్గెట్ 30కోట్లు
ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ 30కోట్ల డీల్స్ సెట్ చేసుకునే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. అది కూడా మూడు నెలల్లోనే ఒక ప్లాన్ రెడీ అయ్యిందట. సోలో బ్రతుకే సో బెటర్ సినిమాతో పాటు, దేవకట్టా సినిమాకు కూడా సాయి ధరమ్ తేజ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. గతంలో ఎప్పుడు లేని విధంగా వరుస ఆఫర్స్ అందుకుంటున్న సాయి కేవలం తనకు నచ్చిన కథలను మాత్రమే ఎంచుకుంటున్నాడాట.
Recommended Video
మరో నాలుగు సినిమాలు..
ఇకపోతే సాయి ధరమ్ తేజ్ మరో నాలుగు సినిమాలకు త్వరలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. సుకుమార్ నిర్మాతగా ఆయన శిష్యుడితోనే ఒక సినిమా చేయనున్నాడట. అలాగే మరోక కొత్త దర్శకుడితో కూడా వర్క్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. వెంకటేష్ తో కూడా ఒక మల్టీస్టారర్ సినిమా చేసే ఛాన్స్ ఉన్నట్లు ఇటీవల రూమర్స్ వచ్చాయి. ఫైనల్ గా ఈ మూడు నెలల్లో ఆరు ప్రాజెక్టులకు సంబంధించిన డీలింగ్స్ పై చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. అంటే ఒక్కో సినిమాకు 5కోట్లు అనుకున్నా కూడా మొత్తంగా సాయి 30కోట్ల వరకు తన ఆదాయాన్ని పెంచుకున్నట్లు తెలుస్తోంది.