Don't Miss!
- News అహర్నిశలు ప్రజల మధ్యనే చంద్రబాబు.. చిరంజీవి; పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే
- Finance API: ఫార్మా కంపెనీలకు శుభవార్త.. ఇక లాభాలే..!
- Sports ముంబై ఇండియన్స్కు బిగ్ షాక్: ఆ ఇద్దరికీ కోత
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Automobiles హ్యుందాయ్ ఎక్స్టర్ దిమ్మ తిరిగే మైలేజ్.. ఓనర్ ఫుల్ ఖుష్.. ఫొటోలతో సహా ప్రూఫ్ ఇదిగో.!!
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
- Technology ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
మొదటి సారి పొలిటికల్ కథను టచ్ చేస్తున్న సాయు ధరమ్ తేజ్
చిత్రాలహరి సినిమాతో మొత్తానికి ఫామ్ లోకి వచ్చిన మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కథలను ఎంచుకోవటంలో కాస్త కొత్తగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రతిరోజు పండగే సినిమా తరువాత మళ్ళీ కమర్షియల్ కథలను పక్కన పెట్టాడు. సోలో బ్రతుకే సో బెటర్ అంటూ ఒక కొత్త టైప్ లవ్ స్టోరీని టచ్ చేస్తున్నాడు.
ఇక ఆ తరువాత దేవకట్టతో చేయబోయే సినిమా నెవర్ బిఫోర్ అనేలా ఉంటుందని టాక్ వస్తోంది. ఎందుకంటే దర్శకుడు దేవకట్ట కొన్ని పొలిటికల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా కథను రూపొందించాడట. దీంతో మొదటి సారి సాయి ఒక పొలిటికల్ సినిమాను టచ్ చేయబోతున్నాడు. ఈ కాంబినేషన్ పై గత కొన్ని రోజులుగా అనేక రకాల రూమర్స్ వస్తున్నాయి.
అసలు మ్యాటట్ లోకి వస్తే.. దేవకట్ట సినిమాలో సాయి ఒక ఐఏఎస్ ఆఫీసర్ గా కనిపిస్తాడట. గతంలో ఎప్పుడు లేని విదంగా ఒక కొత్త లుక్ లో కనిపించాలని ఇప్పటికే వర్కౌట్స్ స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇక మరోవైపు దర్శకుడు దేవకట్టా సక్సెస్ చూసి చాలా కాలమవుతోంది. ఇంతకుముందు ఆయన హిందీలో డైరెక్ట్ చేసిన ప్రస్థానం కూడా డిజాస్టర్ అయ్యింది. ఇక ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ తో ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని చూస్తున్నారు. మరి ఆ సినిమా ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.