యాక్సిడెంట్ తరువాత ఆ దర్శకుడితో సినిమా ఫిక్స్ చేసుకున్న సాయి ధరమ్ తేజ్..
ఊహించని విధంగా కొన్ని నెలల క్రితం మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఒక ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. అయితే అదే సమయంలో రిపబ్లిక్ సినిమా విడుదలకు సిద్దంగా ఉండగా సాయి ధరమ్ తేజ్ అసలు ప్రమోషన్ లో పాల్గొనలేదు. అప్పుడపుడే సినిమా ఇండస్ట్రీ మళ్లీ ఫామ్ లోకి వచ్చిన సందర్భంలో ఆ విధంగా సాయి ధరంతేజ్ తన సినిమా ప్రమోషన్ లో కూడా పాల్గొన పోవడంతో ఆ సినిమాపై కొంత ప్రభావం చూపించింది. ఆ తరువాత సాయి కోలుకోవడానికి చాలా కాలం పట్టింది. ఇక ఫైనల్ గా ఇటీవల పూర్తిగా సెట్ అయిన సాయి ధరమ్ తేజ్ ఎప్పటిలానే రెగ్యులర్ సినిమాలతో బిజీ అయ్యేందుకు సిద్ధమయ్యాడు.

పవన్ ద్వారా..
సాయిధరమ్ తేజ రిపబ్లిక్ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నప్పటికీ ఆ సినిమా అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. ఒక విధంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పవన్ ముఖ్య అతిథిగా వచ్చే ప్రత్యేకంగా ఇండస్ట్రీలోనే సమస్యల గురించి మాట్లాడటంతో పాటు అలాగే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కూడా టచ్ చేయడంతో ఒక్కసారిగా బజ్ అయితే పెరిగింది. అంతేకాకుండా ఆ సినిమా ఓపెనింగ్స్ కి కూడా పవన్ స్పీచ్ చాలా బాగా హెల్ప్ అయ్యింది.

ప్లాప్ అయినా బెస్ట్ మూవీ
అది పూర్తి స్థాయిలో రిపబ్లిక్ సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. ఏదేమైనా కూడా సాయిధరమ్ తేజ్ రిపబ్లిక్ సినిమా అవుట్ పుట్ పై చాలా పాజిటివ్ గానే ఉన్నాడు. ఇప్పటికీ కూడా ఆ సినిమా చాలా బెస్ట్ అని కూడా సాయి ధరంతేజ్ అనుకుంటున్నాడు. అయితే సాయి ధరంతేజ్ మాస్ కమర్షియల్ సినిమా చేసే చాలా కాలం అయింది.

సంపత్ నందితో సినిమా
ఇక ప్రస్తుతం పూర్తి స్థాయిలో ఒక కమర్షియల్ మాస్ సినిమా చేయాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక సాయి ధరమ్ తేజ్ తో ప్రత్యేక సాన్నిహిత్యం ఉన్న కొంతమంది యువ దర్శకులతో కూడా చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఆ లిస్టులో సంపత్ నంది కూడా ఉన్నట్లు సమాచారం. రచ్చ సినిమాతో మెగా ఫ్యామిలీకి బాగా దగ్గరైన సంపత్ నంది ఇటీవల కాలంలో గోపీచంద్ తో గౌతమ్ నంద, సిటీ మార్ అనే రెండు సినిమాలతో బాగానే క్రేజ్ అందుకున్నాడు.

పక్క మాస్ కమర్షియల్ సినిమా
సంపత్ నంది కమర్షియల్ సినిమా క్లిక్ అయితే బాక్సాఫీసు వద్ద మంచి కలెక్షన్స్ అందుకుంటుంది అని పలుమార్లు రుజువు చేశాడు. అయితే అతను కూడా పూర్తిస్థాయిలో సక్సెస్ చూసి చాలా కాలం అయింది. ఇక మరొక పక్క మాస్ కమర్షియల్ సినిమా చేయాలని ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఇద్దరు కూడా కథ విషయంలో చర్చలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. మరి ఆ ప్రాజెక్టు ఎంతవరకు సెట్ అవుతుందో చూడాలి.

మళ్ళీ బిజీగా సాయి ధరమ్ తేజ్
మరోవైపు సాయిధరమ్ తేజ్ తో సినిమా చేసేందుకు కొత్త దర్శకులు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. ఒక సీనియర్ దర్శకుడి దగ్గర చాలా కాలంగా పని చేసిన అసిస్టెంట్ డైరెక్టర్ తో కూడా సాయి ధరంతేజ్ వర్క్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సాయి ధరమ్ తేజ్ సుకుమార్ రైటింగ్స్ లో కూడా ఒక సినిమా చేసేందుకు ఒప్పుకున్నాడు. ఇక రాబోయే సినిమాలతో బాక్సాఫీస్ వద్ద మరిన్ని విజయాలు అందుకోవాలని సాయి హార్డ్ వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











