Don't Miss!
- News ఈ అభిమానమే రఘురామ రాజుకు సీటు దూరం చేసింది..!!
- Technology X ప్లాట్ఫాం ప్రీమియం ఫీచర్లను ఉచితంగా వినియోగించుకోవచ్చు.. వారికి మాత్రమేనని ఎలాన్ మస్క్ ప్రకటన!!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Sports రసెల్కు భయపడి ఆ బౌలర్పై వేటు..KKRతో ఆడే RCB తుది జట్టు ఇదే!
- Automobiles సమ్మర్లో కార్లలో వీటిని అస్సలు ఉంచొద్దు.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
Sai Dharam Tej చేతులెత్తి మొక్కుతున్నా.. హెల్మెట్ పెట్టుకొని బైక్ నడపండి.. సాయిధరమ్ తేజ్
శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్పై ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాణ సారథ్యంలో బాపినీడు బీ సమర్పించిన చిత్రం రంగ రంగ వైభవంగా. మెగా హీరో వైష్ణవ్ తేజ్, కేతికా శర్మ జంటగా నటించిన ఈ చిత్రానికి దర్శకుడు గిరీషయా. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం, శ్యామ్ దత్ సునీద్దీన్ సినిమాటోగ్రాఫర్గా వ్యవహరించారు. ఇక ఈ చిత్రం సెప్టెంబర్ 2వ తేదీన రిలీజ్ అవుతున్న నేపథ్యంలో హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. యాక్సిడెంట్ తర్వాత తొలిసారి ఈ వేడుకలో సాయిధరమ్ తేజ్ ముఖ్య అతిథిగా కనిపించారు. ఈ సందర్భంగా సాయిధరమ్ తేజ్ ఎమోషనల్గా మాట్లాడుతూ..
సెప్టెంబర్ 2న మనకు ఇంకో పండుగ. మన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టిన రోజు. మీకు పవర్ స్టార్ అయితే నాకు ఆయన గురువు గారు. సెప్టెంబర్ 2వ తేదీన సినిమా చూసి బర్త్ డే పార్టీ చేసుకోండి అని సాయిధరమ్ తేజ్ అన్నాడు.
మీరంతా ఇంటికి వెళ్తుంటారు. మీరు బైక్ నడిపేటప్పుడు.. హెల్మెట్ వేసుకొని బైక్ నడపండి. మీరు పక్కింటికి వెళ్లినా కూడా హెల్మెట్ పెట్టుకొని వెళ్లండి. నేను హెల్మెట్ పెట్టుకొన్న కాబట్టి యాక్సిడెంట్ జరిగినా బతికి బయటపడ్డాను. కాబట్టి మీకు చేతులు ఎత్తి మొక్కుతున్నాను. హెల్మెట్ లేకుండా బండి నడపకండి. ప్లీజ్.. ప్లీజ్ హెల్మెట్ వేసుకోండి. రోడ్డుపైన ఇసుక ఉంటే ఎవరు ఏం చేస్తారు. విధిరాతను ఎవరు మార్చలేరు. కాబట్టి మీరు హెల్మెట్ వేసుకోండి అని సాయిధరమ్ అన్నారు.
సెప్టెంబర్ 2 తేదీన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బర్త్ డే. రంగ రంగ వైభవంగా సినిమా యూనిట్ తరఫున.. మీ తరఫున హ్యాపీ బర్త్ డే పవన్ కల్యాణ్ అని విషెష్ చెబుతున్నాను. రంగ రంగ వైభవంగా సినిమాను థియేటర్లో చూడండి అని సాయిధరమ్ తేజ్ అన్నారు.