Don't Miss!
- Sports Ravichandran Ashwin:అతను ధోనీకి లెఫ్టాండ్ వర్షన్!
- News చంద్రబాబు బెయిల్ రద్దు పిటీషన్ విచారించిన సుప్రీంకోర్టు
- Technology Ai వీడియో కంటెంట్ ను గుర్తించడానికి Youtube కొత్త టూల్! ఎలా పనిచేస్తుంది?
- Travel ఐఆర్సీటీసీ VIZAG - ARAKU HOLIDAY PACKAGE మార్చి 22 నుంచే..
- Automobiles వయసు కేవలం నెంబర్ మాత్రమే!.. ఎందుకో వీడియో చూస్తే తెలుస్తుంది
- Finance Gold Loan: గోల్డ్లోన్స్ తీసుకున్నోళ్లకి హెచ్చరిక..! ఇవి తప్పక తెలుసుకోండి..
- Lifestyle సంపూర్ణ సూర్యగ్రహణం 2024: అమెరికాలోని వందలాది పాఠశాలలకు సెలవు, ఎందుకో తెలుసా?ఆరోజు ఏం జరుగుతుందో తెలుసా
వెనక్కి తగ్గిన సాయి ధరమ్ తేజ్: బడా స్టార్ల బాటలోనే నడిచేందుకు సిద్ధమైన హీరో
కెరీర్ ఆరంభంలో ఆటుపోట్లను ఎదుర్కొన్నప్పటికీ.. ఈ మధ్య కాలంలో వరుస విజయాలను అందుకుంటూ దూసుకుపోతున్నాడు సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్. సందేశాత్మక కథతో రూపొందిన 'చిత్రలహరి' నుంచి వరుసగా 'ప్రతి రోజూ పండగే', 'సోలో బ్రతుకే సో బెటర్' అనే హిట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం 'రిపబ్లిక్' అనే మూవీ చేస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్లోని రాజకీయల నేపథ్యంతో రూపొందిస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక, తాజాగా ఈ సినిమా గురించి ఓ షాకింగ్ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
వెండితెరపై లిప్లాక్స్.. శృంగార సన్నివేశాల్లో మునిగి తేలిన తారలు
విభిన్న కథా చిత్రాల దర్శకుడిగా పేరొందిన దేవ కట్టా డైరెక్షన్లో సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తోన్న చిత్రమే 'రిపబ్లిక్'. పొలిటికల్ బ్యాగ్డ్రాప్తో రూపొందుతోన్న ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు అనుగుణంగానే దీన్ని ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. ఇక, ఇటీవలే విడుదలైన ఈ మూవీ టీజర్కు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. దీంతో యూనిట్ ఫుల్ జోష్లో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో 'రిపబ్లిక్' మూవీని ముందుగా ప్రకటించినట్లు జూన్ 4 విడుదల చేయడం లేదట. దాన్ని ఆపేయాలని నిర్ణయించుకున్నారని తెలిసింది.
కరోనా ప్రభావం రోజు రోజుకూ ఎక్కువ అవుతోన్న నేపథ్యంలో తెలుగు సినీ ఇండస్ట్రీలోని భారీ చిత్రాల షూటింగులు నిలిపేశారు. అదే సమయంలో విడుదల తేదీలను కూడా వాయిదా వేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు 'రిపబ్లిక్' మూవీని కూడా పోస్ట్పోన్ చేయబోతున్నారని తెలుస్తోంది. ఈ మేరకు ఇవాళ కానీ రేపు కానీ అధికారిక ప్రకటన వెలువడుతుందని సమాచారం. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమాను భగవాన్, పుల్లారావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో ఐశ్వర్య రాజేష్ హీరోయిన్గా నటిస్తోంది. అలాగే, సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నటిస్తున్నారు.