Don't Miss!
- Finance Adani News: గౌతమ్ అదానీ తిరిగొచ్చిన మంచిరోజులు.. ఆ 5 కంపెనీల్లో సంచలనం..
- Technology OnePlus Flip వన్ప్లస్ ఫ్లిప్ ఫోన్ కీలక వివరాలు లీక్... టెలిఫోటో కెమెరా సహా కీలక ఫీచర్లు..!
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- News కాంగ్రెస్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే: రేవంత్తో భేటీ: గ్రేటర్ హైదరాబాద్లో భారీ షాక్
- Lifestyle డిఫరెంట్ స్టైల్ లో నోనూరించే మటన్ రోస్ట్
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
- Sports వరుస పరాజయాల వేళ.. ఆర్సీబీ, కోహ్లీ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్
మీ అంచనాలు అందుకోలేదు, తప్పులు సరిదిద్దుకుంటున్నా: సాయి ధరమ్ తేజ్
మెగా ఫ్యామిలీ నుండి హీరోగా పరిచయమైన హీరో కావడంతో సాయి ధరమ్ తేజ్ వరుస సినిమాల్లో అవకాశాలు దక్కించుకున్నారు. అయితే అందులో విజయాలకంటే అపజయాలే ఎక్కువా ఉన్నాయి. ఈ నేపథ్యంలో తన పుట్టినరోజు సందర్భంగా ఆయన ట్వీట్ పరిశీలిస్తే సక్సెస్ అందుకోవడానికి ఈ మెగా మేనల్లుడు తనలో తాను మేధోమదనం చేసుకుంటున్నట్లు స్పష్టం అవుతోంది. సాయి ధరమ్ తేజ్ అక్టోబర్ 15న 32 వ వసంతంలోకి అడుగు పెడుతున్నాడు.
అత్యంత ప్రియమైన మెగా అభిమానుకు అంతులేని ప్రేమతో రాస్తున్న సందేశం అంటూ ఆయన ఓ సందేశం పోస్టు చేశారు. 'గెలిచినప్పుడు వేలకుపైగా చేతులు చప్పట్లు కొడతాయి. ఓడిపోయినా.. మీ చప్పట్ల చప్పుడు తగ్గకుండా.. జయాపజయాలకు అతీతంగా నన్ను ప్రోత్సహిస్తూ వెన్నంటి ఉన్న అభిమానులకు కృతజ్ఞతలు.' అని వ్యాఖ్యానించారు.
ఈ మధ్య కాలంలో మీ అంచనాలను అందుకోలేకపోయానన్నది వాస్తవం. దానికి కారణాలను విశ్లేషించుకుంటున్నాను. మీ సలహాలు, సూచనలను తీసుకుని చేసిన తప్పులను సరిదిద్దుకుంటూ.. నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకునే ప్రయత్నంలో ఉన్నాను. మీరు నాపై చూపించే ఈ అభిమానమే నన్ను మానసికంగా దృఢంగా ఉంచి మంచి సినిమాలు చేయడానికి ఉత్సాహాన్నిస్తోంది.' అని చెప్పుకొచ్చారు.
సాయి ధరమ్ తేజ్ ఈ ఏడాది నటించిన రెండు చిత్రాలు 'ఇంటిలిజెంట్', 'తేజ్ ఐ లవ్ యూ' బాక్సాఫీసు వద్ద పరాజయం పాలయ్యాయి. ఈ నేపథ్యంలో సినిమాల ఎంపిక విషయంలో తన పంతా మార్చుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. సాయి ధరమ్ తేజ్ త్వరలో కిషోర్ తిరుమల దర్శకత్వంలో 'చిత్రలహరి' సినిమా చేయబోతున్నట్లు సమాచారం.