Don't Miss!
- Automobiles మరింత తక్కువ ధరలో బజాజ్ చేతక్ ఇ స్కూటర్.. త్వరలో లాంచ్.!!
- Technology Dell నుంచి నాలుగు కొత్త Ai ల్యాప్టాప్లు! ధర,స్పెసిఫికేషన్లు
- News భారీ వర్షం - వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..!!
- Sports రోహిత్పై గౌరవం..అంతకుమించి ఏం లేదు: పుకార్లపై ప్రీతి జింటా ఫైర్
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
శుభ సందర్భాన్ని ఎంజాయ్ చేస్తున్న మెగా హీరో.. ఏకంగా థియేటర్కు వెళ్లి మరీ!
కరోనా వైరస్ ప్రభావంతో దాదాపు ఎనిమిదిన్నర నెలల పాటు సినిమా థియేటర్లు మూత పడిపోయాయి. మహమ్మారి తగ్గుముఖం పడుతుండడంతో చాలా రాష్ట్రాల్లో సినిమా హాళ్లను పున: ప్రారంభం చేసుకోవచ్చని ఆయా ప్రభుత్వాలు అనుమతినిచ్చాయి. తెలంగాణలోనూ ఇటీవల అనుమతి లభించినా థియేటర్లు మాత్రం ఓపెన్ కాలేదు. అయితే, డిసెంబర్ 4న హైదరాబాద్ నగరంలోని కొన్ని మల్టీఫ్లెక్సులు తెరుచుకున్నాయి. ఈ నేపథ్యంలోనే మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నేరుగా థియేటర్కు వెళ్లి సినిమా చూస్తున్నట్లు ఓ వీడియోను వదిలాడు.
శుక్రవారం ఉదయం తన నివాసం నుంచి ప్రసాద్ ఐమాక్స్కు వెళ్లిన సాయి ధరమ్ తేజ్.. కరోనా నిబంధనలు పాటిస్తూ థియేటర్లో అడుగు పెట్టాడు. అక్కడ ప్రదర్శితమవుతోన్న 'టెనెట్' సినిమాను చూస్తున్నాడు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించాడు. ఈ మేరకు ప్రత్యేకంగా తయారు చేసిన ఓ వీడియోను విడుదల చేశాడు. 'ఇన్ని రోజులు వినోదం లేక బాధ పడిన సినీ ప్రియులంతా పండుగ చేసుకునే రోజు వచ్చేసింది. అందరూ మాస్కులు ధరించి కరోనా నిబంధనలు పాటించి సినిమాను థియేటర్లలో చూడాలని కోరుకుంటున్నా' అని అందులో పేర్కొన్నాడు.
ఇదిలా ఉండగా, మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన 'ప్రతి రోజూ పండగే' సినిమాతో కెరీర్లోనే భారీ విజయాన్ని అందుకున్నాడు మెగా హీరో సాయి ధరమ్ తేజ్. గత ఏడాది క్రిస్మస్ కానుకుగా విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ అవడంతో పాటు కలెక్షన్ల పరంగానూ దుమ్ము దులిపేసింది. అంతేకాదు, ఈ కుటుంబ కథా చిత్రంలో సాయి ధరమ్ తేజ్ నటనకూ మంచి మార్కులు వచ్చాయి. ఈ క్రమంలోనే అతడు 'సోలో బ్రతుకే సో బెటర్' అనే సినిమా చేశాడు. ఈ సినిమాను కూడా థియేటర్లోనే రిలీజ్ చేయబోతున్నాడు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాతగా సుబ్బు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
It feels good to be back at the theater after a long long time. Watching a movie on the big screen is the ultimate form of entertainment for me. I know many of you feel the same. Let's celebrate cinema again in it's finest form from today. #CelebratingCinema pic.twitter.com/hUylnVhYO6
— Sai Dharam Tej (@IamSaiDharamTej) December 4, 2020