Don't Miss!
- Sports RCB vs KKR: విరాట్ కోహ్లీ ట్రేడ్ మార్క్ సిక్సర్.. బిత్తరపోయిన మిచెల్ స్టార్క్! వీడియో
- News జైల్లో చిప్పకూడే.: కేటీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
- Automobiles గిఫ్ట్ అంటే అబ్బాయిలే ఇవ్వాలా.??.. పెళ్లిలో వరుడికి వధువు అదిరిపోయే బైక్ గిఫ్ట్.. వైరల్ వీడియో చూసేయండి
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
అభిలాష స్పూర్తితో సాయిధరమ్ తేజ్ కొత్త చిత్రం!
మెగాపవర్ స్టార్ సాయిధరమ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం చిత్రలహరి. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 12న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. వరుస పరాజయాల తర్వాత తేజు నుంచి వస్తున్న చిత్రం ఇది. సాయిధరమ్ తేజ్ ఈ చిత్రంపై భారీ ఆశలు పెట్టుకుని ఉన్నాయి. తన తదుపరి చిత్రాలపై కూడా సాయిధరమ్ తేజ్ దృష్టి పెట్టాడు. వినోదాత్మక చిత్రాల దర్శకుడు మారుతి దర్శత్వంలో సాయిధరమ్ తేజ్ తదుపరి చిత్రం ఉండబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మారుతి తేజు కోసం ఓ ఆసక్తికరమైన కథని సిద్ధం చేశాడట.
ఈ చిత్రంలో సాయిధరమ్ తేజ్ లాయర్ పాత్రలో కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మారుతి ఈ చిత్ర కథని మెగాస్టార్ చిరంజీవి సూపర్ హిట్ చిత్రం అభిలాషని స్ఫూర్తిగా తీసుకుని రాశారట. అభిలాష చిత్రంలో చిరంజీవి ఉరి శిక్షని రద్దు చేయాలని కోరుకునే లాయర్ గా కనిపిస్తారు. మరి సాయిధరమ్ తేజ్ ఏ ఆశయం కోసం లాయర్ గా మారుతున్నాడో వేచి చూడాలి.
మారుతి తెరకెక్కించిన చివరి చిత్రం శైలజారెడ్డి అల్లుడు ఆశించిన స్థాయి విజయం సాధించలేదు. సాయిధరమ్ తేజ్ చిత్రలహరి షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలు ప్రారంభించింది. ఇటీవల విడుదలైన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. కిషోర్ తిరుమల ఈ చిత్రానికి దర్శకుడు.