Don't Miss!
- News అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ షురూ: బారులు తీరిన ఓటర్లు
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
అభిలాష స్పూర్తితో సాయిధరమ్ తేజ్ కొత్త చిత్రం!
మెగాపవర్ స్టార్ సాయిధరమ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం చిత్రలహరి. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 12న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. వరుస పరాజయాల తర్వాత తేజు నుంచి వస్తున్న చిత్రం ఇది. సాయిధరమ్ తేజ్ ఈ చిత్రంపై భారీ ఆశలు పెట్టుకుని ఉన్నాయి. తన తదుపరి చిత్రాలపై కూడా సాయిధరమ్ తేజ్ దృష్టి పెట్టాడు. వినోదాత్మక చిత్రాల దర్శకుడు మారుతి దర్శత్వంలో సాయిధరమ్ తేజ్ తదుపరి చిత్రం ఉండబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మారుతి తేజు కోసం ఓ ఆసక్తికరమైన కథని సిద్ధం చేశాడట.
ఈ చిత్రంలో సాయిధరమ్ తేజ్ లాయర్ పాత్రలో కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మారుతి ఈ చిత్ర కథని మెగాస్టార్ చిరంజీవి సూపర్ హిట్ చిత్రం అభిలాషని స్ఫూర్తిగా తీసుకుని రాశారట. అభిలాష చిత్రంలో చిరంజీవి ఉరి శిక్షని రద్దు చేయాలని కోరుకునే లాయర్ గా కనిపిస్తారు. మరి సాయిధరమ్ తేజ్ ఏ ఆశయం కోసం లాయర్ గా మారుతున్నాడో వేచి చూడాలి.
మారుతి తెరకెక్కించిన చివరి చిత్రం శైలజారెడ్డి అల్లుడు ఆశించిన స్థాయి విజయం సాధించలేదు. సాయిధరమ్ తేజ్ చిత్రలహరి షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలు ప్రారంభించింది. ఇటీవల విడుదలైన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. కిషోర్ తిరుమల ఈ చిత్రానికి దర్శకుడు.