Don't Miss!
- News వైసీపీకి చిక్కిన లోకేష్ ట్వీట్..ఆ వెంటనే ఏం చేశారంటే..?
- Finance Gold Rate Today: బంగారం ప్రియులకు షాక్.. పెరిగిన ధర..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- Sports ఖమ్మం క్లాసెన్..మెదక్ మార్క్రమ్: క్రియేటివిటీ కొట్టేవాడే లేడు భయ్యా
- Lifestyle Lok Sabha Election 2024:మరో 3 నెలల్లో పట్టాభిషేకం ఎవరికి? జ్యోతిష్యం ఏ పార్టీకి స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తోంది
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
సయీ మంజ్రేకర్తో అల్లు అర్జున్ రొమాన్స్: అదిరిపోయే ప్లాన్ వేసిన బడా డైరెక్టర్
తెలుగు సినీ ఇండస్ట్రీలోని టాప్ హీరోల్లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఒకడు. మెగా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్తో సినిమాల్లోకి ప్రవేశించిన అతడు.. యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్ ఇలా అన్నింటిలోనూ రాణిస్తూ ఆల్రౌండర్గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ క్రమంలోనే జయాపజయాలతో ఏమాత్రం సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నాడు. గత ఏడాది 'అల.. వైకుంఠపురములో' సినిమాతో ఇండస్ట్రీ హిట్ను అందుకున్న అతడు.. ప్రస్తుతం సుకుమార్తో 'పుష్ప' అనే సినిమా చేస్తున్నాడు. కొద్ది రోజులుగా ఈ సినిమా షూటింగ్ తూర్పు గోదావరి జిల్లా మారేడిమిల్లి అడవుల్లో జరుగుతోంది.
'పుష్ప' మూవీ పట్టాలపై ఉండగానే అల్లు అర్జున్.. టాలీవుడ్ బడా డైరెక్టర్ కొరటాల శివతో సినిమా చేయబోతున్నట్లు ప్రకటించాడు. యువసుధ బ్యానర్, GA2 పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ కూడా పాన్ ఇండియా రేంజ్తో రూపొందనుంది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా 'ఆచార్య' అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు కొరటాల శివ. అదే సమయంలో బన్నీ కూడా సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప' చేస్తున్నాడు. ఈ రెండూ పూర్తయిన వెంటనే వీళ్లిద్దరి కాంబో పట్టాలెక్కనుంది. అంటే 2021 ద్వితియార్థంలో ఇది ప్రారంభమయ్యే ఛాన్స్ ఉంది. ఇక, 2022లో ఈ మూవీ రిలీజ్ అవుతుందన్న టాక్ వినిపిస్తోంది.
ఇదిలా ఉండగా, ఈ సినిమాలో నటించే హీరోయిన్ విషయంలో ఓ న్యూస్ బయటకు వచ్చింది. తాజా సమాచారం ప్రకారం.. అల్లు అర్జున్ - కొరటాల శివ కాంబినేషన్లో రాబోయే సినిమాకు హిందీ భామ సయీ మంజ్రేకర్ను తీసుకున్నారట. ఇప్పటికే ఆమె ఈ సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చిందని తెలిసింది. సల్మాన్ ఖాన్ నటించిన 'దబాంగ్ 3' సహా పలు హిందీ చిత్రాల్లో నటించిన ఈ అమ్మడు.. విలక్షణ నటుడు అడవి శేష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'మేజర్' ద్వారా టాలీవుడ్లోకి అడుగు పెట్టింది. అది విడుదల కాకముందే బన్నీ సినిమాలో ఛాన్స్ పట్టేసింది.