Don't Miss!
- Sports KKR Playing XI: రూ. 24.75 కోట్ల ఆటగాడిపై వేటు! పంజాబ్తో తలపడే కేకేఆర్ తుది జట్టు ఇదే!
- News మరో ఎమ్మెల్సీ ఉపఎన్నికకు షెడ్యూల్ విడుదల: బరిలో తీన్మార్ మల్లన్న
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Technology యూట్యూబ్కు పోటీగా TV యాప్.. ఫీచర్లు, అల్గారిథమ్ పైన X సీఈవో ఏమన్నారంటే.. ?
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
రిపీట్ అవుతున్న ప్లాప్ కాంబినేషన్!
ఏమైంది ఈవేళ చిత్రంతో దర్శకుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న సంపత్ నంది ఆ తర్వాత రచ్చ చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించాడు. రచ్చ చిత్రం కమర్షియల్ గా ఘన విజయం సాధించింది. సంపత్ నంది తెరకెక్కించిన బెంగాల్ టైగర్ చిత్రం కూడా పర్వాలేదనిపించింది. 2017లో సంపత్ నంది హీరో గోపీచంద్ తో గౌతమ్ నంద చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ చిత్రం పూర్తిగా నిరాశపరిచింది.
ఈ చిత్రం తర్వాత సంపత్ నంది నుంచి మరో చిత్రం రాలేదు. ఇటీవల సంపత్ నంది గోపీచంద్ కు ఓ కథ వినిపించాడట. కథ గోపించంద్ కు నచ్చినట్లు తెలుస్తోంది. తమ కాంబినేషన్ లో ప్లాప్ చిత్రం వచ్చినప్పటికీ సంపత్ పై నమ్మకంతో అతడి దర్శత్వంలో మరోమారు నటించేందుకు గోపిచంద్ అంగీకరించినట్లు వార్తలు వస్తున్నాయి.
బెంగాల్ టైగర్ నిర్మాత రాధామోహన్ ఈ చిత్రాన్ని కూడా నిర్మించనున్నట్లు తెలుస్తోంది. గోపీచంద్ కు కూడా ఇటీవల సరైన హిట్ లేదు. దీనితో వీరిద్దరూ ఎలాగైనా హిట్ కొట్టాలని ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ చిత్రం ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గోపీచంద్ చివరగా నటించిన చిత్రం పంతం. గత ఏడాది ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.