Don't Miss!
- Sports ధోనీ ట్రేడ్మార్క్ సిక్సర్..101 మీటర్ల దూరం Video
- News కోనసీమ జిల్లాలో జనసేన ఖాళీ.. మరో నేత రాజీనామా
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
మహేశ్ బాబు దిమ్మతిరిగిపోయే ప్లాన్... సర్కారు వారి పాటలో మరో సూపర్స్టార్
సూపర్ స్టార్ కృష్ణ కుమారుడిగా సినిమాల్లోకి ప్రవేశించాడు హ్యాండ్సమ్ హీరో మహేశ్ బాబు. తండ్రి పేరుతో పరిచయం అయినప్పటికీ.. తనకంటూ ప్రత్యేకమైన శైలిని చూపించి ఫేమస్ అయ్యాడు. కెరీర్ ఆరంభంలోనే భారీ హిట్లను తన ఖాతాలో వేసుకుని టాప్ హీరోగా ఎదిగిపోయాడు. హిట్లు వచ్చినప్పుడు పొంగిపోకుండా.. ఫ్లాపుల వల్ల కృంగిపోకుండా ముందుకెళ్తున్నాడు. ఈ నేపథ్యంలో ఓ పహిల్వాన్తో ఫైటింగ్కు దిగబోతున్నాడు మహేశ్ బాబు. దీని వెనక భారీ ప్లాన్ రెడీ చేసినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఏం జరగబోతుంది.? పూర్తి వివరాల్లోకి వెళితే...
హ్యాట్రిక్ హిట్స్.. మహేశ్ బాబు దూకుడు
కొన్నేళ్లుగా మహేశ్ బాబు దూకుడు ప్రదర్శిస్తున్నాడు. వరసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్న అతడు.. సత్తా చాటుతున్నాడు. ఆ మధ్య ‘భరత్ అనే నేను'.. గత ఏడాది ‘మహర్షి' వంటి సూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకున్న సూపర్ స్టార్... ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ‘సరిలేరు నీకెవ్వరు'తో హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసి ఔరా అనిపించాడు.
ప్రకటనకు ముందే హిట్ కాంబోకు బ్రేక్
‘సరిలేరు నీకెవ్వరు'తో మాంచి జోష్ మీద ఉన్నాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. ఈ సినిమా విడుదల కాకముందే తన తదుపరి చిత్రాన్ని వంశీ పైడిపల్లితో చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అందుకు అనుగుణంగానే సదరు డైరెక్టర్ మాఫియా బ్యాగ్డ్రాప్లో ఓ కథ రాసుకొచ్చాడని ప్రచారం జరిగింది. అయితే, అనివార్య కారణాల వల్ల ఈ సినిమా ప్రకటనకు ముందే ఆగిపోయింది.
వంద కోట్ల దర్శకుడితో మహేశ్ సినిమా
‘గీత గోవిందం'తో వంద కోట్ల మార్కును అందుకున్న దర్శకుడు పరశురాం. ప్రస్తుతం మహేశ్ బాబు అతడితోనే ‘సర్కారు వారి పాట' అనే సినిమా చేస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్ ఎంటర్టైనర్స్తో కలిసి మహేశ్ ఈ చిత్రాన్ని స్వయంగా నిర్మిస్తున్నాడు. ఇందులో హీరోయిన్గా కియారా అద్వాణీని తీసుకుంటున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.
మహేశ్ ట్రిపుల్ రోల్.. రికార్డులు బద్దలు
సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేశారు. దీనికి భారీ స్థాయిలో రెస్పాన్స్ రావడంతో పాటు ఎన్నో రికార్డులు బద్దలైపోయాయి. అంతేకాదు, ట్విట్టర్లో ఎక్కువ రీట్వీట్లు అందుకుని సత్తా చాటింది. ఇక, ఈ మూవీలో మహేశ్ బాబు త్రిపాత్రాభినయం చేయబోతున్నాడని కొద్ది రోజులుగా ఓ వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది.
మహేశ్ కోసం కర్నాటక నుంచి విలన్
మహేశ్ బాబు సినిమా అంటే ఓ రేంజ్ ఉంటుంది. అందుకే ప్రతి సినిమాలో అతడికి సమఉజ్జీగా నటించే విలన్ ఉంటాడు. ఇందులో భాగంగానే కన్నడంలో సూపర్స్టార్గా వెలుగొందుతోన్న కిచ్చా సుదీప్.. ‘సర్కారు వారి పాట'లో విలన్గా చేస్తున్నాడని ఇటీవల ఓ న్యూస్ బయటకు వచ్చింది. గతంలో అతడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఈగ'లో నెగెటివ్ రోల్ చేసిన విషయం తెలిసిందే.
Recommended Video
సూపర్ ప్లాన్ రెడీ చేసిన సూపర్ స్టార్.!
తాజాగా ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇండస్ట్రీ ఏరియాలో చక్కర్లు కొడుతోంది. దీని ప్రకారం... ఈ సినిమాకు సుదీప్ను విలన్గా తీసుకోవడం వెనుక మహేశ్ బాబు వేసిన భారీ ప్లాన్ ఉందట. ‘సర్కారు వారి పాట'ను కన్నడంలోనూ రూపొందించాలని చిత్ర యూనిట్ భావిస్తోందని తెలిసింది. అందుకే అక్కడి సూపర్ స్టార్ను తీసుకుంటున్నారని సమాచారం.