twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అఖిల్ గుర్రపు స్వారీ.. మిస్టర్ మజ్ను తరువాత ఈ చిత్రమే!

    |

    అక్కినేని వారసుడు అఖిల్ ప్రస్తుతం తన మూడవ చిత్రంలో నటిస్తున్నాడు. మిస్టర్ మజ్నుగా అఖిల్ మూడవ చిత్రం తెరకెక్కుతోంది. అఖిల్ నటించిన తొలి రెండు చిత్రాలు నిరాశ పరచడంతో మూడవ చిత్రంపై అఖిల్ దృష్టి పెట్టాడు. తొలి ప్రేమ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న వెంకీ అట్లూరి ఈ చిత్రానికి దర్శకుడు.

    అఖిల్ నాల్గవ చిత్రానికి సంభందించిన ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి. హీరో ఆది పినిశెట్టి సోదరుడు సత్య ప్రభాస్ పినిశెట్టి ఈ చిత్రానికి దర్శత్వం వహించబోతున్నట్లు తెలుస్తోంది. అఖిల్ కోసం సత్య ప్రభాస్ ఆసక్తికరమైన కథని రూపొందించాడట. కథ చర్చలు పూర్తయ్యాయని అధికారికంగా ప్రకటించడమే మిగిలి ఉందని అంటున్నారు.

    Sathya Prabhas to direct Akhil

    ఈ చిత్రంలో అఖిల్ గుర్రపు స్వారీ చేసే జాకీ పాత్రలో కనిపిస్తాడని ప్రచారం జరుగుతోంది. అఖిల్ బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్లుగా దర్శకుడు కథ రూపొందించినట్లు తెలుస్తోంది.

    English summary
    Sathya Prabhas to direct Akhil. Interesting details about this project
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X