Don't Miss!
- Finance Iran-Israel War: స్టాక్ మార్కెట్లపై ఇరాన్-ఇజ్రాయెల్ వార్ ప్రభావం ఇదే..!! జాగ్రత్త..
- News కాంగ్రెస్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే: రేవంత్తో భేటీ: గ్రేటర్ హైదరాబాద్లో భారీ షాక్
- Lifestyle డిఫరెంట్ స్టైల్ లో నోనూరించే మటన్ రోస్ట్
- Technology ఆంధ్రప్రదేశ్ లో 7.9 మిలియన్ల 5G యూజర్ లతో, Airtel మరో రికార్డు! 5G విస్తరణ వివరాలు
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
- Sports వరుస పరాజయాల వేళ.. ఆర్సీబీ, కోహ్లీ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
మహేష్ బాబే కావాలి.. ఒక్కప్పుడు హిట్టిచ్చిన దర్శకుల మధ్య పోటీ.. రాజమౌళి కంటే ముందే
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఒక సినిమా చేయాలని ప్రతి దర్శకుడు కోరుకుంటాడు. మహేష్ కూడా టాలెంట్ ఉన్న హిట్ దర్శకులను వెతికి మరి సినిమా ఆఫర్లు ఇవ్వడానికి రెడీగా ఉంటాడు. అయితే చాలా రోజుల తరువాత ఇద్దరు సీనియర్ దర్శకులు మహేష్ బాబు కోసం స్పెషల్ గా టార్గెట్ పెట్టినట్లు తెలుస్తోంది. దర్శకధీరుడు రాజమౌళి కంటే ముందే ఒక సినిమా చేయాలని చాలా కసిగా ప్లాన్ చేసుకుంటున్నట్లుగా టాక్ వస్తోంది.
సర్కారు వారి పాట.. పక్కా ప్లానింగ్ తో..
నెక్స్ట్ మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. పక్కా ప్లానింగ్ తో ఆ సినిమా షూటింగ్ ను పూర్తి చేయబోతున్నాడు మహేష్. డైరెక్టర్ పరశురామ్ కూడా మహేష్ ఇచ్చిన డేట్స్ లోపే ఫినిష్ చేయడానికి ట్రై చేస్తున్నాడట. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాపై అంచనాలు అయితే భారీగానే ఉన్నాయి.
రాజమౌళి ప్రాజెక్ట్.. క్లారిటీ లేదు
ఇక సర్కారు వారి పాట అనంతరం మహేష్ బాబు డైరెక్ట్ గా రాజమౌళితో కలుస్తాడా లేదా అనేది హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే రాజమౌళి RRR సినిమాను వచ్చే ఏడాది రిలీజ్ చేస్తాడా లేదా అనే విషయంలో క్లారిటి లేదు. 2021 సంక్రాంతికి రావాల్సిన ఆ సినిమా కరోనా లాక్ డౌన్ ఎఫెక్ట్ వల్ల 2022సంక్రాంతికి రావచ్చని టాక్ వస్తోంది.
మహేష్ కోసం పోటీ మొదలైంది
ఇక మహేష్ బాబు సర్కారు వారి పాట షూటింగ్ పూర్తి చేశాక ఒక నాలుగైదు నెలలు రాజమౌళి కోసం వెయిట్ చేయాల్సిందేనా అనే కామెంట్స్ ఎక్కువగా వస్తున్నాయి. అందుకే ఆ గ్యాప్ లో మరో సినిమా చేయాలని కూడా అనుకుంటున్నాడు. ఇక అందుకోసం యువ దర్శకులు సీనియర్ దర్శకుల మధ్య ఫొటో ఎక్కువైనట్లు టాక్ వస్తోంది. ముఖ్యంగా ఇద్దరు సీనియర్ దర్శకులైతే మహేష్ పై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు టాక్.
ఒక్కడు కాంబినేషన్..
ఒక్కడు సినిమాతో మహేష్ బాబు కెరీర్ కు మరచిపోలేని క్రేజ్ అందించిన దర్శకుడు గుణశేఖర్. ఆ తరువాత అర్జున్, సైనికుడు సినిమాలు చేశారు కానీ వర్కౌట్ కాలేదు. ఇక మధ్య మధ్యలో మహేష్ బాబుతో సినిమా చేయాలని గుణశేఖర్ ప్రయత్నం చేసినప్పటికీ కూడా కుదరలేదు. ఇక రాజమౌళి కంటే ముందే ఒక గ్యాప్ దొరకడంతో కథ చెప్పాలని ట్రై చేస్తున్నాడట. చేతిలో ఉన్న శాకుంతలం సినిమా అయిపోక ముందే మహేష్ బాబుతో కొత్త సినిమాను ఎనౌన్స్ చేయాలని చూస్తున్నాడు.
Recommended Video
శ్రీను వైట్ల కూడా..
ఇక మరొక దర్శకుడు శ్రీను వైట్ల పరిస్థితి కూడా అలానే ఉంది. మహేష్ బాబుతో దూకుడు సినిమా చేసి బాక్సాఫీస్ హిట్ అందుకున్న ఆయన ఆ తరువాత దూకుడు సినిమాతో డిజాస్టర్ ఎదుర్కొన్నారు. ఇక చాలా కాలం తరువాత మరో సినిమా చేయాలని ట్రై చేస్తున్నారు. ప్రస్తుతం మంచు విష్ణుతో మరో ఢీ లాంటి సినిమా చేస్తున్న శ్రీను వైట్ల ఎలాగైనా ఆ సినిమా అయిపోక ముందే మహేష్ తో ప్రాజెక్ట్ ఫిక్స్ చేసుకోవాలని అనుకుంటున్నాడట. మరి మహేష్ బాబు ఈ ఇద్దరిలో ఎవరికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో చూడాలి.