Don't Miss!
- Travel ఐఆర్సిటీసి వారి హైదరాబాద్ టు అహ్మదాబాద్ 8 రోజుల ట్రైన్ టూర్ ప్యాకేజీ...
- News కేసీఆర్ డ్రామా అదిరిందయ్యా చంద్రం!
- Finance Gold Bonds: గోల్డ్ బాండ్స్ ప్రీమెచూర్ ధర ప్రకటించిన ఆర్బీఐ.. పూర్తి వివరాలివే..
- Automobiles సేఫ్టీలో మహీంద్రా బొలెరో నియోకు కేవలం 1-స్టార్ రేటింగ్.. దీనిపై కంపెనీ ఏమందంటే??
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- Sports ఆ చెత్త నిర్ణయమే ఆర్సీబీ కొంపముంచింది- ఫించ్
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
అర్జున్ రెడ్డికి అదే ప్రాణం, అందుకే రిస్క్ చేయడం లేదు.. కబీర్ సింగ్ గురించి షాహీద్
బాలీవుడ్లో విభిన్నపాత్రలను ఎంపిక చేసుకొనే హీరోల్లో షాహీద్ కపూర్ ఒకరు. ప్రస్తుతం తెలుగులో ఘనవిజయం సాధించిన అర్జున్ రెడ్డి రీమేక్ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో హిందీలో కబీర్ సింగ్ పేరుతో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. తెలుగులో ఈ చిత్రాన్ని తెరకెక్కించిన సందీప్ రెడ్డి వంగ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండటం గమనార్హం. ఈ సినిమా గురించి ఇటీవల షాహీద్ కపూర్ సెన్సేషనల్ వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏమన్నారంటే..
సినిమాకు అదే ప్రాణంగా
అర్జున్ రెడ్డి చిత్రాన్ని చాలా నిజాయితీగా ముతకగా తెరకెక్కించారు. భావోద్వేగాలతో ఉండే ఓ యువకుడి జీవిత ప్రయాణాన్ని ఆసక్తికరంగా తెర మీద చూపించారు. అదే సినిమాకు ప్రాణంగా మారింది అని షాహీద్ కపూర్ అన్నారు.
నిజాయితీగా అర్జున్ రెడ్డి చిత్రం
నిజాయితీగా తీయడంతో అర్జున్ రెడ్డి చిత్రం ప్రేక్షకులకు కనెక్ట్ అయింది. హీరో యాటిట్యుడ్ ఎలివేట్ కాకపోతే సినిమా కొంత మేరకే సక్సెస్ అయి ఉండేది. కథ, కథనాలు, హీరో క్యారెక్టర్ దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకొనే అంశాలుగా ఉంటాయి. అందుకే ఈ సినిమాను చేయడానికి ముందుకొచ్చాను.
మార్పులు చేయడం లేదు
హీందీ వెర్షన్ కబీర్ సింగ్ (అర్జున్ రెడ్డి) చిత్రాన్ని అదే నిజాయితీతో రూపందిస్తున్నాం. తెలుగులో ఏ విధంగా ఓ ముతకగా ఉంటుందో.. అదే విధంగా సినిమాలో ఎమోషన్స్ ఉంటాయి. కథ, కథనంలో పెద్దగా ఎలాంటి మార్పు చేయడం లేదు. హిందీ నేటివిటి కోసం, ఇది ఇప్పటికే చూశామని ప్రేక్షకుడు ఫీల్ కాకుండా అక్కడక్కడ చిన్న మార్పులు ఉంటాయి.
రీమేక్ చేయడం కష్టమైన పని
అర్జున్ రెడ్డి ఓ విజయవంతమైన చిత్రాన్ని రీమేక్ చేయడం చాలా కష్టమైన పని. అంతేకాకుండా సవాల్తో కూడుకొన్నది. కథను కాపీ చేసి.. యధాతథంగా తెరకెక్కించడం కుదరదు. ఏదొ కొంత కొత్తదనం ఉండాలి. అప్పుడే సినిమా ప్రేక్షకులకు నచ్చుతుంది అని షాహీద్ కపూర్ అన్నారు.
ఢిల్లీ, ముంబైలో కబీర్ సింగ్
అర్జున్ రెడ్డి సినిమా హైదరాబాద్, బెంగళూరు నేపథ్యంగా సాగితే.. కబీర్ సింగ్ ఢిల్లీ, ముంబైలో జరుగుతుంది. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ ఒకేలా ఉండరు. వారిద్దరు కజిన్స్లా కనిపిస్తారు. కేవలం కబీర్ సింగ్ జీవన ప్రయాణమే కనిపిస్తుంది అని షాహీద్ పేర్కొన్నారు. ఈ చిత్రంలో షాలిని పాండే స్థానంలో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్నది.