Don't Miss!
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Sports RCB vs KKR: 500 టీ20 మ్యాచ్ ఆడబోతున్న ఐపీఎల్ స్టార్.. మ్యాన్ ఆఫ్ మెయిడెన్ ఓవర్స్
- News వైసీపీకి చిక్కిన లోకేష్ ట్వీట్..ఆ వెంటనే ఏం చేశారంటే..?
- Finance Gold Rate Today: బంగారం ప్రియులకు షాక్.. పెరిగిన ధర..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
తమిళ్ సినిమాలపై శర్వానంద్ స్పెషల్ ఫోకస్.. ఖైదీ గ్యాంగ్తో న్యూ ప్రాజెక్ట్!
టాలీవుడ్ యువ హీరో శర్వానంద్ గతకొంతకాలంగా వరుస అపజయాలతో కాస్త ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. 2017లో చివరగా మహానుభావుడు సినిమాతో సక్సెస్ అందుకున్న శర్వానంద్ ఆ తరువాత సరైన సక్సెస్ అందుకోలేదు. వరుసగా మూడు సినిమాలు దెబ్బకొట్టాయి. పడి పడి లేచే మనసు సినిమాతో పాటు రణరంగం, జాను సినిమాలు కూడా డిజాస్టర్ అయ్యాయి.
ఆ మూడు సినిమాలు మినిమామ్ వసూళ్లను కూడా అందుకోలేకపోయాయి. నిర్మాతలకు భారీ నష్టాలను కలిగించాయి. దీంతో నెక్స్ట్ శ్రీకారం అనే సినిమాతో సక్సెస్ అందుకోవాలని చూస్తున్నాడు. ఆ సినిమా వ్యవసాయం బ్యాక్ డ్రాప్ లో రానుంది. ఇక ప్రస్తుతం ఈ యువ హీరో తమిళ్ సినిమాలపై కూడా స్పెషల్ గా ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. గతంలో జర్నీ సినిమాతో తమిళ్ లో కూడా ఈ హీరో మంచి సక్సెస్ అందుకున్నాడు.
ఇక చాలా రోజుల తరువాత వరుసగా తమిళ్ కథలను కూడా ఒకే చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే శ్రీ కార్తిక్ అనే కొత్త దర్శకుడితో ఒక సినిమాను స్టార్ట్ చేశాడు. తమిళ్ తెలుగులో ఒకేసారి తెరకెక్కుతున్న ఆ సినిమాను కార్తీ ఖైదీ నిర్మాతలు రూపొందిస్తున్నారు. ఇక నెక్స్ట్ ఖైదీ సినిమాకు పనిచేసిన టెక్నీషియన్స్ తోనే శర్వా మరొక సినిమాను చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరి తమిళ్ లో ఈ హీరో ఎంతవరకు సక్సెస్ అవుతాడో చూడాలి.