Don't Miss!
- Sports ఐపీఎల్లో అదరగొడుతున్న అన్ క్యాప్డ్ ప్లేయర్లు వీళ్లే..
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- News సెంటిమెంట్ కలిసొస్తే - అదే ఫలితం రిపీట్...!!
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
- Technology ఎయిర్ కండిషనర్ AC ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా... అయితే ఇవి తెలుసుకోండి..!
- Automobiles కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- Lifestyle భార్యా భర్త గొడవపడినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
తమిళ్ సినిమాలపై శర్వానంద్ స్పెషల్ ఫోకస్.. ఖైదీ గ్యాంగ్తో న్యూ ప్రాజెక్ట్!
టాలీవుడ్ యువ హీరో శర్వానంద్ గతకొంతకాలంగా వరుస అపజయాలతో కాస్త ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. 2017లో చివరగా మహానుభావుడు సినిమాతో సక్సెస్ అందుకున్న శర్వానంద్ ఆ తరువాత సరైన సక్సెస్ అందుకోలేదు. వరుసగా మూడు సినిమాలు దెబ్బకొట్టాయి. పడి పడి లేచే మనసు సినిమాతో పాటు రణరంగం, జాను సినిమాలు కూడా డిజాస్టర్ అయ్యాయి.
ఆ మూడు సినిమాలు మినిమామ్ వసూళ్లను కూడా అందుకోలేకపోయాయి. నిర్మాతలకు భారీ నష్టాలను కలిగించాయి. దీంతో నెక్స్ట్ శ్రీకారం అనే సినిమాతో సక్సెస్ అందుకోవాలని చూస్తున్నాడు. ఆ సినిమా వ్యవసాయం బ్యాక్ డ్రాప్ లో రానుంది. ఇక ప్రస్తుతం ఈ యువ హీరో తమిళ్ సినిమాలపై కూడా స్పెషల్ గా ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. గతంలో జర్నీ సినిమాతో తమిళ్ లో కూడా ఈ హీరో మంచి సక్సెస్ అందుకున్నాడు.
ఇక చాలా రోజుల తరువాత వరుసగా తమిళ్ కథలను కూడా ఒకే చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే శ్రీ కార్తిక్ అనే కొత్త దర్శకుడితో ఒక సినిమాను స్టార్ట్ చేశాడు. తమిళ్ తెలుగులో ఒకేసారి తెరకెక్కుతున్న ఆ సినిమాను కార్తీ ఖైదీ నిర్మాతలు రూపొందిస్తున్నారు. ఇక నెక్స్ట్ ఖైదీ సినిమాకు పనిచేసిన టెక్నీషియన్స్ తోనే శర్వా మరొక సినిమాను చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరి తమిళ్ లో ఈ హీరో ఎంతవరకు సక్సెస్ అవుతాడో చూడాలి.