Don't Miss!
- News జగన్ పై దాడి ఘటనలో మరో టర్నింగ్ ! వడ్డెర సంఘాల ఎంట్రీ..
- Lifestyle ఎండాకాలంలో ఈ ఫుడ్స్కు దూరంగా ఉండాలి.. లేదంటే డీహైడ్రేషన్ తప్పదు..
- Technology ధర రూ.1799 కే, Youtube ,UPI ఫీచర్లతో Itel కొత్త ఫీచర్ ఫోన్! సేల్ వివరాలు
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Sports సూర్య సిగ్గుపడాలి.. క్రీడాస్ఫూర్తిని మరిచి నీఛమైన పని!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
క్రేజీ హీరో సాహసం.. 37 రోజుల్లో ఎంత బరువు తగ్గాడో తెలుసా!
తమిళ స్టైలిష్ హీరో శింబు ఇటీవల మంచి చిత్రాలు చేస్తున్నాడు. ప్రస్తుతం శింబు కెరీర్ గ్రాఫ్ స్టడీగా ఉంది. భవిష్యత్తులో శింబు మరిన్ని క్రేజీ చిత్రాలకు సిద్ధం అవుతున్నాడు. శింబు గత ఏడాది మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన చక్క చివంత వానం చిత్రంలో నటించాడు. ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ఈ ఏడాది విడుదలైన అత్తారింటికి దారేది రీమేక్ చిత్రం నిరాశపరిచింది. ప్రస్తుతం శింబు వెంకట్ ప్రభు దర్శకత్వంలో నటించేందుకు సిద్ధం అవుతున్నాడు.
ఈ చిత్రంలో శింబు పాత్ర వైవిధ్యంగా ఉంటుందట. దీని కోసం బరువు తగ్గాలని దర్శకుడు శింబుకి సూచించాడు. దీనితో శింబు బరువు తగ్గడంపై దృష్టి పెట్టి కేవలం 37 రోజుల్లోనే 13 కేజీలు తగ్గినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం శింబు స్లిమ్ లుక్ లో కనిపిస్తున్నాడు. కేవలం 37 రోజుల్లో 13 కేజీలు బరువు తగ్గడం అంటే ఒకరకంగా సాహసమే అని చెప్పొచ్చు. మే నెలలో ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.
ఈ చిత్రానికి 'మానడు' అనే టైటిల్ ఖరారు చేశారు. యంగ్ బ్యూటీ కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్ గా నటిస్తోంది. కళ్యాణి ప్రియదర్శన్ ఇటీవలే చిత్రలహరి చిత్రంతో విజయం సొంతం చేసుకుంది. తన సోదరుడి పెళ్లి కార్యక్రమాల్లో బిజీగా ఉన్న శింబు ఫోటోలు వైరల్ అవుతున్నాయి. శింబు స్టైలిష్ లుక్ చాలా బావుందంటూ ప్రశంసిస్తున్నారు.