Don't Miss!
- News ఘోర ప్రమాదం: లారీని ఢీకొనడంతో చిన్నారి సహా ఆరుగురు మృతి
- Sports SRH vs RCB: ఫుల్ టాస్కు ఔటైన మార్క్రమ్.. నవ్వు ఆపుకోలేకపోయిన కోహ్లీ!వీడియో
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
అత్తారింటికి దారేది రీమేక్ రిలీజ్ డేట్ ఫిక్స్!
స్టైలిష్ హీరో శింబు నటించిన అత్తారింటికి దారేది రీమేక్ విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ చిత్రాన్ని తమిళంలో వంత రాజవతాన్ వరువేన్ పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని దర్శకుడు సుందర్ సి తెరకెక్కిస్తున్నారు. శింబు సరసన మేఘా ఆకాష్, కేథరిన్ హీరోయిన్లుగా నటించారు. సుందర్ సి ఈ చిత్రాన్ని కలర్ ఫుల్ గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఈ చిత్రాన్ని త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించారు.
తెలుగులో ఈ చిత్రం ఘనవిజయం సాధించగా ఆ మ్యాజిక్ ని తమిళ్ లో కూడా రిపీట్ చేయాలని శింబు అండ్ టీం భావిస్తోంది. సంక్రాంతికే విడుదుల కావాల్సిన ఈ చిత్రం అనివార్య కారణాల వలన వాయిదా పడింది. తాజాగా ఈ చిత్ర విడుదల తేదీ ప్రకటించారు. ఫిబ్రవరి 1 ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.
దర్శకుడు సుందర్ ఎలాంటి మార్పులు లేకుండా అత్తారింటికి దారేది కథని అదే విధంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. హిప్ హాప్ తమిజా ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. తెలుగులో రికార్డులు సృష్టించిన ఈ చిత్రం తమిళంలో ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.