Don't Miss!
- News సీఎం జగన్ వద్దకు భూమా అఖిల ప్రియ.. తరువాత ఏం జరిగిందంటే..!
- Sports క్లాసెన్కు కావ్య మారన్ స్పెషల్ గిఫ్ట్!
- Finance Ambani-Adani: చేతులు కలిపిన అంబానీ-అదానీ.. 20 ఏళ్లకు అగ్రిమెంట్.. ఆ స్టాక్ దూకుడు..
- Automobiles హ్యుందాయ్ కస్టమర్లకు అదిరిపోయే న్యూస్.. వేసవిలో ప్రత్యేకంగా సర్వీస్ క్యాంప్.. ఎప్పటివరకు అంటే.??
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
- Lifestyle నోరూరించే పచ్చి మామిడికాయ గొజ్జు మామిడికాయ కర్రీ వేడివేడి అన్నంతో తింటుంటే ఆహా అనాల్సిందే..
- Technology ఆపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024 తేదీ వెల్లడి.. iOS 18, GenAI పై కీలక ప్రకటనలకు అవకాశం..!
పాలకొల్లులో ఫ్యామిలీతో బన్నీ సంక్రాంతి సంబురం... 10 లక్షలతో కళ్యాణ మండపం
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సంక్రాంతి సంబరాలను తమ కుటుంబ స్వస్థలమైన పాలకొల్లులో జరుపుకున్నారు. సోమవారమే భార్య పిల్లలతో కలిసి పాలకొల్లు చేరుకున్న బన్నీకి ఫ్యాన్స్ నుంచి ఘన స్వాగతం లభించింది. రాజమండ్రి నుంచి తమ అభిమాన హీరోను ర్యాలీగా పాలకొల్లు తీసుకొచ్చారు.
Recommended Video
పాలకొల్లులో తమ బంధువులు, సన్నిహితులతో కలిసి అల్లు అర్జున్ మకర సంక్రాంతి వేడుకల్లో మునిగి తేలారు. ఈ సందర్భంగా బన్నీని చూసేందుకు చుట్టుపక్కల ఊర్ల నుంచి భారీగా అభిమానులు తరలి వచ్చారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి బన్నీ ప్రసంగించారు. తమపై చూపిస్తున్న అభిమానానికి కృతజ్ఞతలు తెలిపారు.
కళ్యాణ మండపం కట్టిస్తానన్న బన్నీ
‘మా కుటుంబానికి పాలకొల్లు చాలా ఇచ్చింది. నాకు ప్రతి సంక్రాంతి ఇక్కడే జరుపుకోవాలని ఉంటుందని తెలిపారు. పాలకొల్లు కోసం ఏదైనా చేయాలనుకుంటున్నాను. అది ఈ సంవత్సరమే చేయబోతున్నట్లు తెలిపిన బన్నీ.... రూ. 10 లక్షల ఖర్చుతో కళ్యాణ మండపం కట్టించబోతున్నట్లు తెలిపారు. వెంటనే దీని నిర్మాణ పనులు ప్రారంభించబోతున్నారు.
అల్లు రామలింగయ్య విగ్రహం వద్ద సందడి
పాలకొల్లులో ఏర్పాటు చేసిన తన తాతయ్య అల్లు రామలింగయ్య విగ్రహానికి బన్నీ, కుటుంబ సభ్యులు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఇదే విగ్రహం వద్ద నిల్చొని బన్నీ తన అభిమానులను ఉద్దేశించి ప్రసంగించారు
బంధువులతో కలిసి సంక్రాంతి
పాలకొల్లులోని తమ బంధుమిత్రులతో కలిసి అల్లు అర్జున్ సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారితో కలిసి గ్రూప్ ఫోటో దిగారు.
అల్లు అర్జున్ మూవీస్
అల్లు అర్జున్ సినిమాల విషయానికొస్తే... ఆయన చివరి సినిమా 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' విడుదలై ఆరు నెలలు దాటిపోయింది. తర్వాతి సినిమా త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయబోతున్నారు. అల్లు అర్జున్- త్రివిక్రమ్ కాంబినేషన్లో గతంలో జులాయి, సన్నాఫ్ సత్యమూరి లాంటి హిట్ సినిమాలు వచ్చాయి. దీని తర్వాత వీరు ముచ్చటగా మూడోసారి కలిసి పని చేస్తున్నారు. సంక్రాంతి తర్వాత షూటింగ్ ప్రారంభం కానుంది.