Don't Miss!
- Sports LSG vs CSK: రూ. కోట్లు పలికిన ఆ ఇద్దరిని తప్పించాం- రుతురాజ్
- Lifestyle ఇవి తింటే మీ జుట్టు చాలా బలంగా మారుతుంది.. బట్టతల కూడా రాదు..
- News Lok Sabha Election 2024: 102 సీట్లలో తొలి దశ పోలింగ్ పూర్తి- దాదాపు 60 శాతం ఓటింగ్..!
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
మరో సినిమాను లైన్ లో పెట్టిన సుధీర్ బాబు.. సీనియర్ నటుడి దర్శకత్వంలో..
విభిన్నమైన సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న సుధీర్ బాబు నెక్స్ట్ కూడా చాలా డిఫరెంట్ సినిమాలను లైన్ లో పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. గత ఏడాది నానితో చేసిన V సినిమా డైరెక్ట్ గా ఓటీటీలో విడుదలైన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా హిట్టవ్వలేదు. ఊహించని విధంగా డిజాస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది.
ఇక ప్రస్తుతం సుధీర్ 'శ్రీదేవి సోడా సెంటర్' అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. ఆ సినిమాకు సంబంధించిన టీజర్ సాంగ్ మంచి బజ్ క్రియేట్ చేశాయి. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా మొదటి సాంగ్ ను కూడా రిలీజ్ చేశారు. ఇక మరోవైపు మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే టైటిల్ తో రూపొందుతున్న ఆ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది.
అదే విధంగా మరొక కొత్త ప్రాజెక్ట్ ను కూడా లైన్ లో పెడుతున్నట్లు సమాచారం. నటుడు హర్షవర్ధన్ దర్శకత్వంలో కూడా సినిమా చేయడానికి ఒప్పుకున్నట్లు సమాచారం. మనం, గుండెజారి గల్లంతయ్యిందే వంటి సినిమాలకు డైలాగ్స్ అందించిన హర్షవర్ధన్ ఆ మధ్య శ్రీముఖితో ఒక సినిమా చేసిన విషయం తెలిసిందే. కానీ ఆ సినిమా ఎటు తేలకుండానే కనుమరుగయ్యింది. ఇక ఇప్పుడు సుధీర్ బాబుకు కొత్త స్టోరీ చెప్పి ఒప్పించినట్లు సమాచారం. మరి సినిమాతో ఎంతవరకు సక్సెస్ అందుకుంటాడో చూడాలి.