Don't Miss!
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
- News పోటీ నుంచి తప్పుకున్న శ్రీరాములు భార్య, రంగంలోకి గాలి జనార్దన్ రెడ్డి, వార్ వన్ సైడ్ కాదు, పోటీ !
- Finance IPO News: ఐపీవో బంపర్ లిస్టింగ్.. తొలిరోజే అప్పర్ సర్క్యూట్ తాకి భారీ లాభాలు.. కొన్నారా..
- Sports ప్రశాంతంగా ఉన్నా.. ఇక చాలు- నరైన్ షాకింగ్ కామెంట్స్
- Automobiles ఈ కార్లు కొనుగోలు చేసేవారికి శుభవార్త!.. మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్స్
- Technology Android 15 Features ఆండ్రాయిడ్ 15 లో క్వారంటైన్ ఫీచర్.. ఎలా పనిచేస్తుంది.. ఏంటి ఉపయోగం..??
ఐదుగురి దర్శకుల చేతుల మీదుగా.. ఇది మామూలు ప్రమోషన్స్ కాదు!
యంగ్ హీరో సందీప్ కిషన్ ప్రస్తుతం ఫుల్ స్పీడులో ఉన్నాడు. ఏ1 ఎక్స్ప్రెస్తో మంచి ఫాంలోకి వచ్చాడు. అసలే వరుస హిట్లతో దూసుకుపోతోన్నాడు సందీప్ కిషన్. నిను వీడిని నీడను నేను, తెనాలి రామకృష్ణ సినిమాలతో హిట్లు కొట్టాడు. తాజాగా ఏ1 ఎక్స్ప్రెస్ అంటూ మరో బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే తాజాగా సందీప్ కిషన్ కొత్త ప్రాజెక్ట్ గురించి ఓ అప్డేట్ వచ్చింది.
సందీప్ కిషన్ బాబీ సింహా ప్రధాన పాత్రల్లో రాబోతోన్న మూవీకి సంబంధించిన అప్డేట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. కోన వెంకట్ నిర్మిస్తోన్న ఈ మూవీ కొత్త టైటిల్ను లాంచ్ చేసేందుకు ఐదుగురు టాప్ డైరెక్టర్స్ను రంగంలోకి దించారు. ఇంతకు ముందు రౌడీ బేబీ అనే టైటిల్తో ఈ మూవీ రాబోతోన్నట్టు ప్రకటించారు.అయితే కొన్ని సమస్యలు తలెత్తడంతో రౌడీ బేబీ టైటిల్ను వదిలేసుకోవాల్సి వచ్చింది.
అందుకే ఈ కొత్త టైటిల్పై అందరికీ ఆసక్తి కలిగేలా, అందరి దృష్టి పడేలా పూరి జగన్నాథ్, గోపీచంద్ మలినేని, బాబీ, శివ నిర్వాణ, హరీష్ శంకర్ ఇలా ఐదుగురు దర్శకులతో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. ఈ ఐదుగురు దర్శకులు కలిసి మార్చి 10న ఉదయం పది గంటలకు పది నిమిషాలకు కొత్త టైటిల్ను రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. నేహా శెట్టి హీరోయిన్గా వస్తోన్న ఈ మూవీకి జీ నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు.