Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
తప్పులు చేశాను.. చేదు అనుభవాలే మిగిలాయి.. సందీప్ కిషన్ ఎమోషనల్
ప్రస్థానంతో నటుడిగా గుర్తింపు తెచ్చుకొన్న సందీప్ కిషన్.. వెంకటాద్రి ఎక్స్ప్రెస్తో హీరోగా చెలరేగిపోయాడు. ఆ తర్వాత డీ ఫర్ దొపిడి, మహానగరం, శమంతకమణి, నక్షత్రం, కేరాఫ్ సూర్య సినిమాల్లో పెర్ఫార్మెన్స్తో ఆకట్టుకొన్నాడు. అయితే ఇటీవల కాలంలో వరుసగా పరాజయాలు పలకరించాయి. అయితే స్వయంకృపరాధం అనే మాట సినీ వర్గాల్లో వినిపించింది. తాజాగా తన తప్పులు తెలుసుకొని సరిదిద్దుకొనే ప్రయత్నం చేసినట్టు వెల్లడించారు. ఇటీవల మే 5వ తేదీన జన్మదినం జరుపుకొన్న సందీప్ కిషన్ ఇటీవల మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..
నా పదేళ్ల కెరీర్ చూసుకొంటే
నా పదేళ్ల కెరీర్ను చూసుకొంటే జయపజయాలు, ఎత్తు పల్లాలు కనిపిస్తాయి. కెరీర్లో నేను కొన్ని తప్పులు చేశాను. అదే సమయంలో మంచి చిత్రాల్లో నటించి మెప్పించాను. ఇప్పుడు నేను నా తప్పులు తెలుసుకొని సరిదిద్దుకొన్నాను. మారిన మనిషిగా అందరి మెప్పు పొందుతాను అని సందీప్ కిషన్ ఉద్వేగంగా మాట్లాడారు.
గతేడాది వైఫల్యాలతో చేదు అనుభవాలు
గతేడాది నాకు చాలా చేదు అనుభవం మిగిల్చింది. నా సినిమాల ఎంపికలో కొంత జాగ్రత్త వహించాలని అనుకొన్నాను. అందుకే కోసమే ఆచీ తూచి అడుగులు వేశాను. ఈ ఏడాది నిర్మాతగా కూడా మరో బాధ్యతను భుజానకు ఎత్తుకొన్నాను. ఈ కొత్త పాత్రతో విజయం సాధిస్తాననే నమ్మకం ఉంది అని సందీప్ కిషన్ అన్నారు.
నిను వీడని నీడను నేనేలే టీజర్కు మంచి రెస్పాన్స్
ప్రస్తుతం నేను నటిస్తున్న నిను వీడని నీడను నేనేలే సినిమా మంచి చిత్రం అవుతుంది. చాలా గ్రాఫిక్ వర్క్ చేశాం. కార్తీక్ రాజు సినిమాను ఆసక్తికరంగా తెరకెక్కించారు. ఇటీవల విడుదలైన టీజర్ అన్ని వర్గాలను ఆకట్టుకొంటున్నది. టీజర్లో నా ప్రతిభను చాలా మంది గుర్తించి ప్రశంసిస్తున్నారు అని సందీప్ కిషన్ తెలిపారు.
తెనాలి రామకృష్ణ బీఏబీఎల్తో
ప్రస్తుత ఏడాదిలోనే మరో విభిన్నమైన చిత్రం తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్ సినిమాలో కనిపించబోతున్నాను. ఈ సినిమాకు జీ నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ఏడాది నూటికి నూరు శాతం మళ్లీ ప్రేక్షకులను, అభిమానులను మెప్పిస్తాను అని సందీప్ కిషన్ ధీమా వ్యక్తం చేశారు.