Don't Miss!
- News రాహుల్ సహా నేడు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటోన్న కీలక నేతలు వీరే..
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మరో పసి ప్రాణాన్ని కాపాడిన మహేష్ బాబు.. అసలైన శ్రీమంతుడు!
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ లో ఎంత మంది స్టార్ హీరోలు ఉన్నా కూడా అందులో కొందరు మాత్రమే మంచి సహాయ కార్యక్రమాలు చేసుకుంటూ వెళుతున్నారు. కేవలం వెండితెర పైనే కాకుండా నిజ జీవితంలో కూడా వారికి తోచిన విధంగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. మహేష్ బాబు కూడా తనదైన శైలిలో చిన్న పిల్లల ప్రాణాలు అండగా నిలుస్తున్న విషయం తెలిసిందే. మహేష్ బాబుకు చిన్న పిల్లలు అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కష్టాల్లో ఉన్న చిన్నారులకు ఆరోగ్య పరమైన సమస్యలను ఎదుర్కొంటున్న వారికి మహేష్ సహాయం అందించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. చిన్నారుల అనారోగ్య సమస్యల విషయంలో మహేష్ బాబు ఎంతో ఖర్చు చేస్తూ వారి ప్రాణాలను కాపాడేందుకు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఎంత ఖర్చయినా సరే అంటూ ముందుకు వస్తున్నారు.
ఇక మరోసారి మహేష్ బాబు నిజమైన శ్రీమంతుడు అనిపించుకున్నారు. ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు మరో సారి ఒక పసిపాప అనారోగ్యంతో ఉండగా తన వంతు సహాయం చేసి అండగా నిలిచారు. మహేష్ బాబు ప్రతి ఏడాది కూడా గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులకు ఉచితంగా చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్న విషయం తెలిసిందే. ఇక మరో సారి తన సొంత ఖర్చులతో భవ్య అనే చిన్నారికి ఊపిరి పోశారు. టెటాలజీ ఆఫ్ ఫాలోట్ సర్జరీ కోసం ఆ పాప కుటుంబ సభ్యులు గత కొన్ని నెలలుగా ఎంతగానో కష్టపడుతున్నారు. అయితే ఆర్థిక పరిస్థితులు బాగా లేకపోవడం వలన ఇప్పటికే చాలా అప్పులు చేసి ఆమెకు వైద్య పరీక్షలు చేయించారు. మహేష్ బాబు గురించి తెలుసుకొని ఆయన సన్నిహితులను కలవడంతో కొన్ని రోజుల్లోనే పాపకు సర్జరీ కోసం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
మహేష్ బాబు మరోసారి మంచి పని చేయడంతో అభిమానుల సోషల్ మీడియాలో ఆ విషయాన్ని షేర్ చేసుకున్నారు. ఇప్పటికే వెయ్యి మందికి పైగా చిన్నారులకు గుండె సంబంధిత ఆపరేషన్ చేయించి సహాయం చేసిన మహేష్ ఇప్పుడు ఆ పాపను కాపాడిన విధానం ఎంతగానో ఆకట్టుకుంటోంది. మహేష్ బాబు మంచి మనసు ఏమిటో మరోసారి అర్థమయింది. కేవలం సినిమాల్లోనే కాకుండా నిజ జీవితంలో కూడా నిజమైన శ్రీమంతుడిగా పేరు సంపాదించుకున్నాడు.
ఇక మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. గీత గోవిందం దర్శకుడు పరశురామ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా పై అంచనాలు ఏ స్థాయిలో పెరుగుతున్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమాలో.కమర్షియల్ అంశాలే కాకుండా మంచి సందేశం కూడా ఉందని దర్శకుడు ఒక క్లారిటీ ఇచ్చాడు. మహేష్ బాబు గత కొంత కాలంగా తన సినిమాల్లో ఏదో ఒక మంచి విషయాన్ని చెప్పేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. ఇక సర్కారు వారి పాట కూడా అందరికీ కనెక్ట్ అయ్యేలా ఒక మంచి సందేశం ఉంటుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమా అనంతరం మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమాతో బిజీగా కానున్న విషయం తెలిసిందే. ఇక ఈ రెండు సినిమాల అనంతరం సూపర్ స్టార్ రాజమౌళితో మొదటి పాన్ ఇండియా సినిమాను స్టార్ట్ చేయమన్నాడు.