మహేశ్ - నమ్రత పెళ్లికి ఆ కండిషన్తో సూపర్ స్టార్ కృష్ణ హైడ్రామా... చివరకు ఆమె ఎంట్రీతో పెళ్లి!
టాలీవుడ్లో మోస్ట్ లవబుల్ అండ్ బెస్ట్ కపుల్ అనగానే సూపర్ స్టార్ మహేశ్ బాబు, నమ్రతా శిరోద్కర్ పేర్లే ముందుగా అందరికీ గుర్తొస్తాయి. నేడు ఈ క్యూట్ కపుల్ 19వ వివాహ వార్షికోత్సవం. అయితే వీరి ప్రేమ పెళ్లి వెనక ఓ పెద్ద డ్రామానే జరిగింది. అప్పట్లో సూపర్ స్టార్ కృష్ణ ఈ జంట పెళ్లికి ఓ కండిషన్ పెట్టారట. దీంతో చివరకు వీరిద్దరి పెళ్లి ఆమె ఎంట్రీ వల్ల జరిగిందని తెలిసింది. ఈమె చెప్పడం వల్లే కృష్ణ.. మహేశ్ - నమ్రత పెళ్లికి ఒప్పుకున్నారట. దాని గురించి ఈ కథనం..
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ బడా ఫ్యామిలీల్లో ఘట్టమనేని కుటుంబం కూడా ఒకటి. సూపర్ స్టార్ కృష్ణ తన అందం, నటనతో ఎంతో మంది ప్రేక్షకుల్ని సంపాదించుకున్నారు. తెలుగు చిత్ర సీమలో ఓ సరికొత్త ట్రెండ్ను సెట్ చేశారు. ఆయన తర్వాత సూపర్ స్టార్ మహేశ్ బాబు కూడా ఇదే రేంజ్లో స్టార్ డమ్ను అందుకుని కృష్ణ నటన వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. త్వరలోనే దర్శకధీరుడు రాజమౌళితో చేయనున్న సినిమాతో గ్లోబల్ వైడ్గా పేరు తెచ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

అయితే మహేశ్ది ప్రేమ పెళ్లి అన్న సంగతి తెలిసిందే. హీరోయిన్ నమ్రత శిరోద్కర్తో ఈయన పెళ్లి బంధం ఏర్పడి దాదాపు 19ఏళ్లు అయింది. ఈ జంటకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. ఈ ఇద్దరు తమ ప్రేమ, పెళ్లి జీవితాన్ని ఎంతో ఆనందంగా గడుపుతూ ప్రతిఒక్కరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. అందరీ ప్రేమాభిమానాలను పొందుతున్నారు.
అయితే ఈ ఇద్దరి పెళ్లి అంత ఈజీగా జరగలేదు. సాధారణంగా సెలబ్రిటీల పెళ్లి ఎంత హడావిడిగా ఉంటుందో తెలిసిందే. కానీ మహేశ్ - నమ్రత పెళ్లి సింపుల్గా జరిగిపోయింది. ఎందుకంటే మొదట సూపర్ స్టార్ కృష్ణకు ఈ పెళ్లి ఇష్టం లేదట. వంశీ సినిమా షూటింగ్ సమయంలోనే మహేశ్ బాబు - నమ్రత ఇద్దరూ ప్రేమలో పడ్డారు. అప్పుడు తమ ప్రేమ విషయాన్ని కృష్ణకు చెప్పారట. కానీ సూపర్ స్టార్ మాత్రం ససేమీరా అన్నారు. కానీ ఆ తర్వాత మహేశ్ సోదరి ఘట్టమనేని మంజుల ఎంట్రీ ఇచ్చి కృష్ణను బాగా కన్విన్స్ చేసిందట. అప్పుడు జేమ్స్ బాండ్ అయిన కృష్ణ వీరి పెళ్లికి ఒప్పుకున్నారట. కానీ పెళ్లి జరిగే ముందు ఓ కండిషన్ పెట్టారట. అదేంటంటే ఇద్దరు స్టార్ స్టేటస్ అందుకున్నాక చేసుకోవాలని అన్నారు.
కానీ ఆ తర్వాత కృష్ణకే ఆ కండీషన్ మరీ అంత కన్విన్సింగ్గా అనిపించక వద్దులే అన్నారట. వాస్తవానికి మహేశ్ - నమ్రత మొదట రహస్యంగా ముంబయిలో పెళ్లి చేసుకున్న సంగతి చాలా మందికి తెలిసిన విషయమే. తర్వాత ఘట్టమనేని మంజుల ప్రోత్సాహంతో ఈ జంటకు మళ్ళీ వివాహం చేసి ఆశ్వీర్వదించారు కృష్ణ. ఈ జంట ప్రేమ, పెళ్లి బంధానికి గుర్తుగా కొడుకు గౌతమ్ కృష్ణ, కూతురు సితార జన్మించారు.

ఇక నేడు మహేశ్ - నమ్రత తమ పెళ్లి రోజు ఒకరినొకరు సోషల్ మీడియా వేదికగా విష్ చేసుకుంటారన్న సంగతి తెలిసిందే. అలానే నేడు కూడా చేసుకున్నారు. నమ్రతా ఒక అందమైన పప్పీల జంట వీడియోతో ఎంతో క్యూట్గా విషెస్ చెప్పింది. అభిమానులు కూడా ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతూ కామెంట్లు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











