Sushant Singh Rajput‌ ను మర్డర్ చేశారు.. సూసైడ్ కాదు.. రక్షణ కల్పిస్తే సీబీఐకి అన్ని చెబుతా!

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం వ్యవహారం మరోసారి వివాదాస్పదంగా సంచలనం రేపుతున్నది. ఇప్పటి వరకు సుశాంత్ మరణం ఆత్మహత్యే అని ధృవీకరించిన పోలీసులకు, దర్యాప్తు సంస్థలకు షాకిచ్చేలా జేజే హాస్పిటల్ మార్చురీ సిబ్బంది చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదంగా మారాయి. ప్రస్తుతం తునీషా శర్మ ఆత్మహత్యపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో మరోసారి సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం హత్యే అంటూ హాస్పిటల్ సిబ్బంది చేసిన వివరాల్లోకి వెళితే...

సుశాంత్ బాడీలో ఎముకలు విరిగిపోయి

సుశాంత్ బాడీలో ఎముకలు విరిగిపోయి


సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత ఆయన మృతదేహానికి పోస్టు మార్టమ్ నిర్వహించిన అటెండెంట్ మీడియాతో మాట్లాడుతూ.. సుశాంత్ బాడీని చితకబాదిన ఆనవాళ్లు ఉన్నాయి. పలు చోట్ల ఎముకలు విరిగిపోయాయి. బాడీలో విరిగిన ఎముకలు ఉంటే ఎలా ఆత్మహత్య చేసుకొంటాడు అని పోస్ట్ మార్టం నిర్వహించిన సిబ్బంది ప్రశ్నించాడు.

 ఒంటిపై కమిలిన దెబ్బలు

ఒంటిపై కమిలిన దెబ్బలు


సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతదేహాన్ని పరిశీలిస్తే.. ఆయనది ఆత్మహత్య కాదు అనేది స్పష్పంగా కనిపించింది. బలవంతంగా ఆయనను ఒత్తిడికి గురిచేసి ఉంటారు. ఆయన ఒంటిపై కమిలిన ఆనవాళ్లు ఉన్నాయి. ఇవన్నీ చూస్తే సుశాంత్‌ ఆత్మహత్య చేసుకొని ఉండరనే అభిప్రాయం కలిగింది అని పోస్టు మార్టం సిబ్బంది చెప్పారు.

సుశాంత్ మృతదేహాన్ని చూడగానే అనుమానాలు

సుశాంత్ మృతదేహాన్ని చూడగానే అనుమానాలు


2020 సంవత్సరం జూన్ 14, 15 తేదీల్లో నేను డ్యూటీలో ఉన్నాను. ఒక వీఐపీ మృతదేహం వచ్చిందని మాకు అధికారులు చెప్పారు. శవానికి కట్టి ఉన్న వస్త్రాన్ని విప్పగానే.. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ దేహం కనిపించింది. ఆ బాడీని చూడగానే చాలా అనుమానాలు రేకెత్తాయి. సూసైడ్ కంటే ఏదో జరిగిందనే భావన, అనుమానం కలిగింది అని పోస్ట్ మార్టం సిబ్బంది తెలిపారు.

28 ఏళ్ల సర్వీసులో ఇలాంటి సూసైడ్

28 ఏళ్ల సర్వీసులో ఇలాంటి సూసైడ్

పోస్టు మార్టం నిర్వహించిన సమయంలో నా అధికారికి ఓ మాట చెబుతూ.. నేను నా 28 ఏళ్ల సర్వీసులో ఇలాంటి సూసైడ్ చూడలేదు. సూసైడ్ కంటే ఏదో బలంగా అతడి మెడపై నొక్కినట్టు మచ్చలు కనిపించాయి. ఆయన మెడపై బలంగా ఏదైనా వస్తువుతో బిగించినట్టు అనిపించింది. శరీరంపై చాలా చోట్ల దెబ్బలు కనిపించాయి. ఆయన మృతదేహాన్ని చూస్తే ఎవరైనా ఆయనది ఆత్మహత్య కాదు.. మర్డర్ అని సులభంగా చెబుతారు అని పోస్ట్ మార్టం సిబ్బంది పేర్కొన్నారు.

సీబీఐ విచారణకు హాజరువుతాను..

సీబీఐ విచారణకు హాజరువుతాను..

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ది ఆత్మహత్య కాదని అప్పుడు ఎందుకు చెప్పలేదని మీడియా ప్రశ్నిస్తే.. అప్పటి వాతావరణం చూసి నేను మౌనంగా ఉన్నాను. నా ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందనే భయంతో ఏం మాట్లాడలేదు. ముఖ్యమంత్రి మాకు రక్షణ కల్పిస్తే.. నేను సీబీఐ ముందుకు వెళ్లి చెబుతాను. ఆ రోజు ఏం జరిగిందనే విషయాన్ని స్పష్టంగా వివరిస్తాను. సుశాంత్ కుటుంబానికి న్యాయం లభించేందుకు పోరాటం చేస్తాను అని పోస్ట్ మార్టం సిబ్బంది చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X